Hindu Communities :మరోసారి మహారాష్ట్ర ముస్లిం సంఘాలను హెచ్చరించిన హిందూ సంఘాలు

Hindu Communities :మరోసారి మహారాష్ట్ర ముస్లిం సంఘాలను హెచ్చరించిన హిందూ సంఘాలు

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లా కుల్దాబాద్ ప్రాంతంలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని వెంటనే తొలగించాలని విహెచ్‌పీ (విశ్వ హిందూ పరిషత్), భజరంగ్ దళ్ డిమాండ్ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే, 1992లో కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చినట్లుగానే, ఈ సమాధిని తాము తొలగిస్తామని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని ఔరంగజేబ్ సమాధి వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. పోలీసు విభాగాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ డిమాండ్ 

ఔరంగజేబ్ సమాధి నాటి వెట్టి చాకిరీకి, బానిసత్వానికి, మొఘలుల పాలనలో హిందువులపై జరిగిన వేధింపులకు చిహ్నమని వీహెచ్ పీ, భజరంగ్ దళ్ స్థానిక నేతలు కిషోర్ చవాన్, నితిన్ మహాజన్, సందేశ్ భెగ్డేలు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఈ డిమాండ్‌ను తెలియజేసేలా వినతిపత్రాలు సమర్పించనున్నట్టు ప్రకటించారు.

శివసేన (ఏక్‌నాథ్ శిండే వర్గం) మద్దతు

ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న డిమాండ్ కు శివసేన (ఏక్ నాథ్ శిండే వర్గం) మద్దతు తెలిపింది.ప్రజలను వేధింపులకు, అణచివేతకు గురిచేసిన పాలకుడి సమాధిని ప్రత్యేక భద్రత పెట్టి మరీ కాపాడాల్సిన అవసరం ఏంటని మంత్రి సంజయ్ శిర్సత్ ప్రశ్నించారు.

kc4vfof8 aurangzeb 625x300 10 March 25

ప్రభుత్వ చర్యలు ,భద్రతా ఏర్పాట్లు

వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఔరంగజేబ్ సమాధి వద్ద భద్రతను పెంచి, పోలీసు బందోబస్తును మరింత కట్టుదిట్టం చేసింది.అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా ప్రతికూల ప్రభావం పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మధ్య విపరీతమైన శత్రుత్వం కొనసాగింది.శివాజీ హిందువుల హక్కుల కోసం పోరాడుతూ మొఘల్ పాలనకు ఎదురు నిలిచారు.చారిత్రక విభేదాలు, సామాజిక అసమానతలు మత ఘర్షణలకు ప్రధాన కారణాలు. ఇలాంటి ఘర్షణలు దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి.మతపరమైన వివాదాలు ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటాయి, సామాజిక శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయి.

Related Posts
Narendra Modi:దేశ ఐక్యతను దెబ్బతీసే వారి కుట్రలను సాగనివ్వబోమన్న ప్రధాని
narendra modi

దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలులోకి రాకుండా తమ ప్రభుత్వం కట్టుబాటుగా Read more

రూ.12 కోట్ల బంగారం స్మగ్లింగ్ – నటి రాన్యా రావు అరెస్టు
రూ.12 కోట్ల బంగారం స్మగ్లింగ్ - నటి రాన్యా రావు అరెస్టు

15 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ నిన్న బెంగళూరు ఎయిర్‌పోర్టులో పట్టుబడిన రాన్యా. దుబాయ్ నుంచి ఇటీవల గోల్డ్ బిస్కెట్లను దుస్తుల్లో తీసుకొచ్చిన రాన్యా రావు. రాన్యా Read more

ఢిల్లీ మహిళలకు బీజేపీ ప్రభుత్వం శుభవార్త
ఢిల్లీ మహిళలకు బీజేపీ ప్రభుత్వం శుభవార్త

ఢిల్లీ మహిళలకు బీజేపీ ప్రభుత్వం శుభవార్త అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సహాయం అందించే మహిళా సమృద్ధి యోజన పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు Read more

ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అండర్ వరల్డ్ డాన్
ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అండర్ వరల్డ్ డాన్

ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం సన్నిహితుడిగా ఉన్న ఛోటా రాజన్, 2001లో హోటల్ యజమాని జయ శెట్టి హత్య కేసుకు సంబంధించి 2024లో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే, Read more