IAS officers did not get relief in the high court

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్‌: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈరోజు తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హతపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు సూచించింది. స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంజ్ ఆదేశించింది. స్పీకర్ కు ఏలాంటి టైం బాండ్ లేదని హైకోర్టు పేర్కొంది. రీజనబుల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు… స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టేసింది. దీంతో ఇప్పుడు తెలంగాణ స్పీకర్‌ నిర్ణయంపై పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఉంటుంది. ఈ లెక్కన పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కానుందని విశ్లేషకులు అంటున్నారు.

బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా పరిగణలోకి తీసుకోవడంలేదన్నారు. పిటీషనర్ల తరఫు న్యాయవాదులు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.

కాగా, బీఆర్ఎస్​ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జులై 3న హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారని.. వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కూకట్​పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజూరాబాద్​ శాసన సభ్యులు పాడి కౌశిక్​ రెడ్డిలు కొద్ది రోజుల క్రితం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Related Posts
ఏపీలో YCP సోషల్ మీడియా కార్యకర్తల వరుస అరెస్టులు
Appointment of YCP Regional

ఏపీలో వైసీపీ సోషల్ మీడియా వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని అసత్య ప్రచారాలు , నేరాలకు పాల్పడుతుండడం తో పోలీసులు రంగంలోకి Read more

2024లో బ్యాంకుల విస్తరణపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ..
sitharaman

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రసంగిస్తూ , 2024 సెప్టెంబర్ నెల చివరలో బ్యాంకుల విస్తరణ గురించి వివరాలు వెల్లడించారు. 2014 నుండి 2024 మధ్య Read more

ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణం..
Two judges who took oath in AP High Court

అమరావతి : ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ , డాక్టర్‌ యడవల్లి Read more

ఎన్నికలకు ముందు ఆప్ పార్టీకి షాక్
A shock to AAP before elections ED allowed to investigate Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీష్ సిసోడియాలను విచారించేందుకు Read more