అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహ ప్రతిష్ఠాపనపై హైకోర్టు తీర్పు

అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ప్రతిష్ఠాపనపై హైకోర్టు తీర్పు

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ప్రతిష్ఠాపనను నిలిపివేయాలని సామాజిక కార్యకర్త జెట్టి ఉమేశ్వర్‌రావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్ పాల్, జస్టిస్‌ రేణుకా యారాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

Advertisements

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని పబ్లిక్ గార్డెన్‌లో విగ్రహం నిర్మాణాన్ని సవాల్ చేస్తూ ఉమేశ్వర్‌రావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విగ్రహాన్ని తొలగించి, గార్డెన్‌ను యథాతథంగా పునరుద్ధరించాలని ఆయన కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ, ఈ చర్యలు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని, ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని సూచించారు. గార్డెన్‌లో 13 ఎకరాలు ఇప్పటికే ఆక్రమణకు గురవ్వగా, విగ్రహాలు పెడితే స్థలాభావం తలెత్తుతుందని తెలిపారు. పార్క్‌లో పిల్లల ఆటస్థలం తగ్గిపోతుందని, రాజకీయ సమావేశాలకు విగ్రహాలను వాడుకుంటారని, భవిష్యత్తులో ఇతర పార్టీల నేతల విగ్రహాల కోసం డిమాండ్లు రావచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది శాంతిభద్రతలకు ముప్పుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ప్రతిష్ఠాపనపై హైకోర్టు తీర్పు

అయితే, అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్ కుమార్ వాదన ప్రకారం, పిటిషనర్‌కు ఈ వ్యవహారంపై చట్టపరమైన హక్కు లేదని, విగ్రహం ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించదని తెలిపారు. సుప్రీంకోర్టు గత తీర్పులను ఉదహరిస్తూ, విగ్రహాల స్థాపనపై అభ్యంతరాలు ప్రధానంగా కుల, మత పరమైన సందర్భాల్లో మాత్రమే చెల్లుతాయని వాదించారు. దీన్ని పరిశీలించిన ధర్మాసనం, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక విగ్రహ ప్రతిష్ఠాపనను నిలిపివేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

Related Posts
హరీష్‌రావ్ రేవంత్ రెడ్డ్డి మధ్య ముదురుతున్న వివాదం
హరీష్‌రావ్ రేవంత్ రెడ్డ్డి మధ్య ముదురుతున్న వివాదం

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చేపల పులుసు హాట్ టాపిక్ అయింది. సాధారణంగా మాంసాహార ప్రియులు దీన్ని ఇష్టంగా ఆస్వాదిస్తారు. కానీ, రాజకీయ నాయకులు ఈ వంటకాన్ని విమర్శలకు Read more

స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లింగ్విస్టిక్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసిన బెంగళూరులోని శామ్‌సంగ్ R&D ఇన్స్టిట్యూట్
Samsung RD Institute Bangalore which has set up a state of the art linguistics lab

● ల్యాబ్ మిలీనియల్ మరియు Gen Z విద్యార్థులకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలపై శామ్‌సంగ్తో సహకరించడానికి మరియు వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో సహాయపడటానికి Read more

Ashwini Vaishnaw : 1410 గేమింగ్ సైట్లను నిషేధించిన కేంద్రం
Ashwini Vaishnaw 1410 గేమింగ్ సైట్లను నిషేధించిన కేంద్రం

Ashwini Vaishnaw : 1410 గేమింగ్ సైట్లను నిషేధించిన కేంద్రం ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.ఈ అంశానికి సంబంధించి రాష్ట్రాలు తమ Read more

భారతదేశానికి వ్యతిరేకంగా ట్రూడో ఆరోపణలు: పతనానికి మలుపు?
భారతదేశానికి వ్యతిరేకంగా ట్రూడో ఆరోపణలు: పతనానికి మలుపు?

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రస్తుతం తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఆయన రాజీనామాకు దారితీయవచ్చు. లిబరల్ పార్టీలో ఒంటరిగా మారిన ట్రూడో, క్షీణిస్తున్న Read more

×