Heavy air pollution in Delhi.Educational institutions closed

ఢిల్లీలో భారీ వాయు కాల్యుషం..విద్యాసంస్థలు మూసివేత

న్యూఢిల్లీ: ఢిల్లీలో చలితో పాటు వాయు కాలుష్యం కూడా పెరుగుతోంది. దీంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) తీవ్రమైన కేటగిరీకి చేరుకుంది. దీనికి సంబంధించి సోమవారం నుంచి ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో GRAP స్టేజ్-4 ఆంక్షలు అమలులోకి రానున్నాయి. అంతేకాక.. ఢిల్లీ ప్రభుత్వం 10-12 మినహా అన్ని పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 450 దాటింది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం పిల్లల చదువులపైనా ప్రభావం చూపుతోంది. పెద్ద వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో సబ్‌కమిటీ GRAP-4 ఆంక్షలు విధించింది. జీఆర్‌పీఏ-4 అమల్లోకి వచ్చిన తర్వాత సీఎం అతిషి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు.

ఢిల్లీలో GRAP-4 అమలుతో నవంబర్ 18 నుండి 10, 12 తరగతులు మినహా అన్ని విద్యార్థులకు శారీరక తరగతులు నిలిపివేయబడతాయని ముఖ్యమంత్రి అతిశి తెలిపారు. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులు మాత్రమే పాఠశాలకు వెళ్లగా, ఇతర తరగతుల విద్యార్థులు ఆన్‌లైన్‌లో చదువుతారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్ప‌టికే 1 నుంచి ఐదో తరగతి వరకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని సూచించగా.. తాజాగా 6 నుంచి 9, 11తరగతుల విద్యార్థులకు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కమిషన్‌ సూచించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం ఆతిశీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు అలాగే దీూ-×V లేదా అంతకంటే తక్కువ వాహనాలు, హెవీ గూడ్స్‌ వెహికల్స్‌ పై నిషేధం విధించారు. అత్యవసర సేవా వాహనాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. విమానాల్లో ప్రయాణించే వారికి ట్రావెల్‌ అడ్వైజరీ కీలక సూచనలు చేసింది. కొన్ని విమానాలు ఆలస్యం కావచ్చునని, ప్రయాణికులు గమనించాలని పేర్కొంది.

Related Posts
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో
srisimha wedding

టాలీవుడ్ యువ హీరో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ వివాహబంధంలో అడుగుపెట్టారు. సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగా‌తో శ్రీసింహ వివాహం ఘనంగా Read more

భారతదేశంలో ఎరువుల ఆవిష్కరణకు కోరమాండల్ – ఐఎఫ్‌డీసీ భాగస్వామ్యం
Coromandel - IFDC Partnership for Fertilizer Innovation in India

భారత వ్యవసాయ రంగంలో ఎరువుల ఆవిష్కరణకు మరింత ఊతమిచ్చేందుకు కోరమాండల్ ఇంటర్నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ఫెర్టిలైజర్ డెవలప్‌మెంట్ సెంటర్ (IFDC) వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాయి. డిసెంబర్ Read more

నేడు బీహార్‌ క్యాబినెట్ విస్తరణ..
Bihar cabinet expansion today

కొత్తగా ఆరుగురికి మంత్రివర్గంలో చోటు.. పాట్నా : ఈ రోజు బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు తెలిసింది. క్యాబినెట్‌లోకి కొత్తగా ఆరుగురికి చోటు Read more

రేపు స్కూళ్లకు సెలవు
ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు

ఆంధ్రప్రదేశ్‌లో MLC ఎన్నికల నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపు (ఫిబ్రవరి 27) సెలవు ప్రకటించారు. ముఖ్యంగా గుంటూరు-కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గం, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల Read more