हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

HCU Land Issue : నేడు సుప్రీంలో కంచ గచ్చిబౌలి భూ వివాదంపై విచారణ

Sudheer
HCU Land Issue : నేడు సుప్రీంలో కంచ గచ్చిబౌలి భూ వివాదంపై విచారణ

కంచ గచ్చిబౌలి భూముల వివాదం పై దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో, ఈ రోజు సుప్రీం కోర్టులో ఈ కేసుపై కీలక విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ అంశం సామాజిక, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. భూములను చదును చేసే పనులు ప్రారంభించడంతో, సుప్రీం కోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించి తాత్కాలికంగా అన్ని పనులపై స్టే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

20 ఏళ్లుగా వివాదంలో భూములు

ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) శాంతికుమారి అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో, కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవే అని స్పష్టంగా పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా ఈ భూములు న్యాయపరమైన వివాదాల్లో ఉండటంతో ఆ స్థలంలో చెట్లు పెరిగాయని కూడా అఫిడవిట్‌లో వివరించారు. భూములపై ఉన్న వివాదాల కారణంగా ఈ ప్రాంత అభివృద్ధి నిలిచిపోయిందని పేర్కొన్నారు.

HCU: హెచ్‌సీయూ భూముల వివాదం.. పలువురు నాయకులపై కేసు నమోదు

సుప్రీం కోర్టులో జరిగే విచారణపై ఆసక్తి

ఇక నేడు సుప్రీం కోర్టులో జరిగే విచారణను అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ కేసు తీర్పు రాష్ట్ర భూ నిర్వహణ విధానాలపై ప్రభావం చూపే అవకాశముంది. ఇదే సమయంలో ఈ భూములపై హక్కులను నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు న్యాయస్థానం తీర్పుతో ఈ వివాదానికి ముగింపు పడుతుందా? లేక మరింత రాజకీయ, న్యాయ ప్రక్రియలద్వారా దీర్ఘకాలంగా కొనసాగుతుందా అన్నది చూడాల్సిందే.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870