పాలు, పాల పదార్థాలు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ రోజూ వినియోగించే ముఖ్య ఆహారం. అయితే డిటర్జెంట్, యూరియా వంటి హానికర(FSSAIIndia) రసాయనాలతో నకిలీ పాలు తయారు చేస్తున్న ఘటనలు బయటపడటం ప్రజల్లో తీవ్ర భయాందోళనకు దారితీస్తోంది. తాజాగా గుజరాత్లో జరిగిన ఓ తనిఖీలో కేవలం 300 లీటర్ల అసలు పాలతో 1,800 లీటర్ల నకిలీ పాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Read Also:Sweets: జిలేబిని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా?

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు షాక్కు గురయ్యారు. పిల్లలు, గర్భిణీలు, వృద్ధుల ఆరోగ్యంపై ఇలాంటి కల్తీ పాలు తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిటర్జెంట్, యూరియా వంటి పదార్థాలు జీర్ణాశయం, కిడ్నీలు, కాలేయంపై తీవ్ర దుష్ప్రభావాలు కలిగించవచ్చని చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా పాల కల్తీ సమస్య విస్తృతంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAIIndia) ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తరచూ తనిఖీలు నిర్వహించి, నకిలీ పాలు తయారు చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆహార భద్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, వినియోగదారులు కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అనుమానాస్పద పాల ఉత్పత్తులపై అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: