हिन्दी | Epaper

మీకు తరచు గొంతు నొప్పి వస్తుందా ?

pragathi doma
మీకు తరచు గొంతు నొప్పి వస్తుందా ?

కాలం మారినప్పుడు గొంతునొప్పి మరియు గొంతులో కఫం వంటి సమస్యలు ఎక్కువగా కనబడతాయి. కఫం ఎక్కువ అయితే గొంతులో నొప్పి, వైరస్ మరియు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.

కఫాన్ని పెంచే ఆహారాలు వంటి చాక్లెట్లు, క్రీం బిస్కట్లు, స్వీట్లు, కేకులు, చల్లని పానీయాలు, పెరుగు మరియు పాలతో చేసిన పాయసం వంటి వాటికి దూరంగా ఉండాలి. గోరు వెచ్చనినీరు తాగడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మిరియాలు, అల్లం, శొంఠి, పసుపు వంటి పదార్థాలను ఆహారంలో ఎక్కువగా వాడాలి. ఇవి కఫాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

వాము కూడా ఉపయోగించాలి. చెంచా వాముకి రెండు కప్పుల నీటిని మరిగించి ఆ కషాయంతో పుక్కిలించాలి. అలాగే, చెంచా మెంతిని కూడా అదే విధంగా మరిగించి పుక్కిలించినా మంచి ఫలితం ఉంటుంది.

గోరువెచ్చని మిరియాల కషాయంలో చెంచా తేనె కలిపి కొద్దిగా గొంతుకు తగిలేలా మింగడం మంచిది. రెండు చెంచాల తులసి రసంలో కూడా తేనె కలిపి తీసుకోవచ్చు. కానీ, ఇవన్నీ కలిసి వాడకూడదు.

పొగ, శక్తివంతమైన వాసనలు మరియు అలెర్జీలు వంటి ఇర్రిటెంట్స్‌ను దూరంగా ఉంచండి. సరైన విశ్రాంతి తీసుకోవడం శరీరాన్ని పునరుద్ధరించడానికి మరియు సంక్రమణాలను ఎదుర్కొనడంలో సహాయపడుతుంది. లక్షణాలు కొనసాగితే సరైన నిర్ధారణ మరియు చికిత్స కోసం ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870