అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2014-19లో వైజాగ్ లో 4325 ఎకరాల్లో అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాల పై 2019 లో కేసులు నమోదయ్యాయి. 2019-24 మధ్య 17 మెడికల్ కాలేజీలు మేం తెచ్చాం. ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంచేయాలనుకోవడం స్కామ్ అని తూమాటి మాధవరావు అన్నారు. మీ 40 ఏళ్ల చరిత్రలో ఒక్క పోర్టు అయినా కట్టారా. కాకినాడ పోర్టును ప్రైవేట్ అప్పగించింది ఎవరో అందరికీ తెలుసు. ప్రైవేట్ కంపెనీల్లో ప్రభుత్వ పెత్తనమేంటి అన్నారు.

విద్యుత్ ను 2.5కి కొనుగోలు చేయడం స్కామ్ అవుతుందా?
అగ్రిగోల్డ్ కంపెనీ ప్రజలను దోచుకుని పోతే 2019-24 లో మేం న్యాయం చేశాం. 7.5 రూపాయల విద్యుత్ ను 2.5కి కొనుగోలు చేయడం స్కామ్ అవుతుందా. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నాడని ప్రధాని స్వయంగా చెప్పారు. అమరావతిని తెచ్చిన మీకు కృష్ణా,గుంటూరు జిల్లాల్లో 2019లో ఎన్ని సీట్లు వచ్చాయ్. 2019-24 మధ్య టూరిజానికి ఎలాంటి ఇబ్పంది కలగలేదు. 2019-24 మధ్య 13 లక్షల కోట్ల పెట్టుబడులు తీలుకురావడం స్కామ్ అవుతుందా. 2019-24 లో డ్రగ్స్ వచ్చేశాయని ఆరోపణలు చేశారు.
పోర్టులు ఆర్థిక వికాసానికి మూలాధారం
తూమాటి మాధవరావు, రాష్ట్రంలో సాగర్ ప్రాజెక్టులపై, పోర్టుల నిర్మాణం అవసరాన్ని ప్రస్తావిస్తూ.. “పోర్టులు ఆర్థిక వికాసానికి మూలాధారం కావాలి. అయితే ప్రభుత్వాలు కేవలం ఆధికార పోరాటాలకే ముడిపెట్టుకుని రాష్ట్రాభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికలు అమలు చేయలేదు,” అన్నారు. ప్రభుత్వం అన్ని విభాగాల్లో చురుకుగా పనిచేసినట్లుగా చెప్పుకుంటున్నప్పటికీ, సముద్రతీర ప్రాంత అభివృద్ధి, పోర్టుల నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ వంటి కీలక అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని తూమాటి మాధవరావు వ్యాఖ్యానించారు.