हिन्दी | Epaper

Haryana: రూ.20 కోసం తల్లిని హతమార్చిన కొడుకు

Anusha
Haryana: రూ.20 కోసం తల్లిని హతమార్చిన కొడుకు

రోజురోజుకు యువత మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలవుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.తాజాగా హర్యానా (Haryana) రాష్ట్రంలోని నుహ్ జిల్లాలో జరిగిన ఒక దారుణమైన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాదకద్రవ్యాలకు బానిసైన కుమారుడు తన తల్లిని కేవలం రూ.20 ఇవ్వలేదని గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన శనివారం నుహ్ జిల్లాలో జరిగింది. జైసింగ్‌పూర్ గ్రామానికి చెందిన ముబారక్‌, రజియా దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే నాలుగేళ్ల క్రితం రజియా భర్త మరణించాడు. దీంతో రజియా కుమారుడు జింషెడ్‌ మాదకద్రవ్యాలకు బాలనిసయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రూ.20 ఇవ్వాలని తల్లి రజియాను అడిగాడు. అందుకు తల్లి రజియా (Razia) నిరాకరించడంతో ఆగ్రహించిన కుమారుడు జింషెడ్, ఇంట్లోని ఉన్న గొడ్డలి తీసుకొని తల్లిపై దాడికి పాల్పడ్డాడు.కుమారుడి దాడిలో తీవ్రంగా గాయపడిన రజియా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Haryana: రూ.20  కోసం తల్లిని హతమార్చిన కొడుకు
Haryana: రూ.20 కోసం తల్లిని హతమార్చిన కొడుకు

ఈ సంఘటన

అయితే తన తల్లిని చంపిన తర్వాత, జంషెడ్ రాత్రంతా అదే ఇంట్లో పడుకున్నాడు. ఉదయం ఇంట్లో అతన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు జింషెడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తల్లి రజియా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ సంఘటన మానవత్వాన్ని మంటగలిపినట్టుగా ఉంది. డబ్బు కోసం తనను పెంచిన అమ్మను చంపడం అంటే అది ఎంత నీచమైన చర్యో చెప్పడం చాలా కష్టం. యువత ఈ సంఘటనల్ని గమనించి మాదకద్రవ్యాలకు (Drugs) బానిసలవ్వకుండా జాగ్రత్త పడాలి. ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను రక్షించాలి. మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా నియంత్రించేందుకు కఠిన చట్టాలు, నిర్దాక్షిణ్యంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

సమాజంపై మాదకద్రవ్యాల దుర్వినియోగం యొక్క ప్రభావాలు ఏమిటి?

మాదకద్రవ్య దుర్వినియోగం వల్ల ప్రజలు దొంగతనం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా , హింస వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొని తమ వ్యసనాన్ని కొనసాగించడానికి కారణమవుతారు. ఈ నేర కార్యకలాపాలు సమాజాలను ప్రమాదంలో పడేస్తాయి, పోలీసులు, నేర న్యాయ వ్యవస్థతో సహా ప్రజా సేవలపై ఒత్తిడిని కలిగిస్తాయి

యువత పై మద్యం మాదక ద్రవ్యాల ప్రభావం?

నిరంతరం మాదకద్రవ్యాలను దుర్వినియోగం చేసే యువకులు తరచుగా విద్యాపరమైన ఇబ్బందులు, ఆరోగ్య సంబంధిత సమస్యలు (మానసిక ఆరోగ్యంతో సహా), తోటివారితో సంబంధాలు సరిగా లేకపోవడం ,బాల్య న్యాయ వ్యవస్థలో పాల్గొనడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Dharamsthala: ‘ధర్మస్థల’ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేనా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

కొనసాగుతున్న డ్రంకెన్ డ్రైవ్ దాడులు

కొనసాగుతున్న డ్రంకెన్ డ్రైవ్ దాడులు

డ్రైవర్ల మధ్య గొడవ.. లారీ ఢీకొని ఇద్దరు డ్రైవర్ల దుర్మరణం

డ్రైవర్ల మధ్య గొడవ.. లారీ ఢీకొని ఇద్దరు డ్రైవర్ల దుర్మరణం

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి
0:12

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

అనుమానాస్పద స్థితిలో స్కూల్ టీచర్ మృతి

అనుమానాస్పద స్థితిలో స్కూల్ టీచర్ మృతి

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

📢 For Advertisement Booking: 98481 12870