Haryana elections. Parole of Dera Baba once again

హర్యానా ఎన్నికలు.. డేరా బాబాకు మరోసారి పెరోల్‌

Haryana elections.. Parole of Dera Baba once again

న్యూఢిల్లీ: ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ అలియాస్‌ డేరా బాబా మరోసారి జైలు నుంచి బయటకు రానున్నారు. అక్టోబర్‌ 5వ తేదీన హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేరా బాబా పెట్టుకున్న పెరోల్‌ పిటిషన్‌ను ఎన్నికల సంఘం సోమవారం ఆమోదించింది. ఎన్నికల సంఘం ఆమోదం నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఆయన విడుదలకు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.

Advertisements

డేరా బాబాకు హర్యానాలో లక్షలాది మంది అనుచరులున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బయటకు వస్తే ఈ ఎన్నికలపై పెను ప్రభావం పడనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పెరోల్‌ సమయంలో ఆయన హర్యానాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వ్యక్తిగతంగా లేదా సోషల్‌ మీడియా ద్వారా ఎలాంటి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే వీలుండదని సమాచారం. కాగా, ఎన్నికల సంఘం నిర్ణయంతో డేరా బాబాకు తొమ్మిది నెలల్లో పెరోల్‌ లభించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇక గత నాలుగేళ్లలో 15వ సారి.

Related Posts
రాజ్యసభకు కుటమి అభ్యర్దుల నామినేషన్
rajyasabha

రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేస్తున్న టీడీపీ అభ్యర్థులు సానా సతీష్, బీదా మస్తాన్రావు, బిజెపి అభ్యర్థి ఆర్. కృష్ణయ్య మూడు రాజ్యసభ ఎంపి సీట్లకు ముగ్గురు అభ్యర్థులు Read more

అమిత్‌షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదు : షర్మిల
Amit Shah is not eligible to enter Andhra.. Sharmila

అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. పార్లమెంట్‌లో భారతరత్న బీఆర్ Read more

ఫార్ములా-ఈ కేసు..లొట్టపీసు కేసు – కేటీఆర్
KTR e race case

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇటీవల ఫార్ములా-ఈ-కార్ కేసులో ఢిల్లీ ఈడీ నుంచి నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ నోటీసులపై ఆయన తీవ్రంగా Read more

Stalin: జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరగకూడదన్న స్టాలిన్
Stalin: డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలను దెబ్బతీస్తుంది - స్టాలిన్ ఆందోళన

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ డీలిమిటేషన్ ప్రక్రియపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గిపోతుందని, Read more

×