Harish Rao's appeal to farmers

రైతులకు హరీశ్‌రావు విజ్ఞప్తి

ఆదిలాబాద్‌ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు స్పందిస్తూ.. రుణభారం, బ్యాంకుల వేధింపులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీశ్‌రావు అన్నారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం లాభసాటిగా మారిందని, కానీ ఇప్పుడు రైతుల పరిస్థితి మరింత దిగజారిందని విమర్శించారు. రుణమాఫీ మభ్యపెట్టి, హామీలను అమలు చేయకపోవడం వల్లే రైతులు ఈ స్థితిలోకి వచ్చారని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఇప్పటి వరకు 402 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం దుర్మార్గమని హరీశ్‌రావు అన్నారు. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం మౌనంగా ఉండడం దారుణమని మండిపడ్డారు. రైతులు రుణమాఫీ కోసం కలెక్టరేట్‌లు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తమ జీవితాలను కష్టాల్లో నెట్టుకుంటున్నారని చెప్పారు. ఈ దుస్థితి కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.

ఈ సందర్బంగా రైతులెవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదని, బీఆర్‌ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎన్నికల హామీలను అమలు చేయాలని, రుణమాఫీ, బోనస్ వంటి వాగ్దానాలను మర్చిపోవద్దని ఆయన హెచ్చరించారు.

Related Posts
వెనుకంజ‌లో కాంగ్రెస్‌..లీడింగ్‌లో బీజేపీ అభ్య‌ర్థి..కౌటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన వినేశ్ పోగ‌ట్‌
Congress candidate from Julana Vinesh Phogat leaves from a counting center

న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు సందర్భంగా హర్యానాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. కౌటింగ్ కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.చేదు ఫలితాలు ఎదురవుతోన్నాయి. మొదట్లో సాధించిన Read more

BettingApps :ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు ఎందుకంటే!
BettingApps :ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు ఎందుకంటే!

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుఎన్సర్లు విష్ణుప్రియకు పోలీసులు నోటీసులు Read more

అభివృద్ధిపై కేసీఆర్ ప్రభుత్వంలో మాటలే.. మాది చేతల ప్రభుత్వం: మంత్రి కొండా సురేఖ
Minister Konda Surekha comments on kcr govt

వరంగల్‌: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం చేపట్టి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఈరోజు వరంగల్ నగరంలో ఈ Read more

బైడెన్‌ నిర్ణయం: ట్రంప్ అధికారంలోకి రాకముందు ఉక్రెయిన్‌కు కీలక మద్దతు
biden zelensky

ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు, ఇది ఉక్రెయిన్‌కు మిత్ర దేశం నుండి మరింత మద్దతును అందించడానికి Read more