ఏపీ యువతకు చంద్రబాబు శుభవార్త

త్వరలో ఏపీలో ‘హ్యాపీ సండే’: చంద్రబాబు

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ..ఉగాది రోజున ‘పీ4’ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. ఏపీలో త్వరలో ‘హ్యాపీ సండే’ కూడా ప్రారంభిస్తామని, మనుషుల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని, ఇందుకోసం గైడ్‌లైన్స్ రూపొందించాలని అధికారులు సీఎం ఆదేశించారు. మనం చేసే మంచి పనులతోనే సంతోషం కలుగుతుందని, కష్టపడి పని చేసినందువల్ల చాలా విభాగాల్లో ఫలితాలు కనబడుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.

ఏపీలో త్వరలో ‘హ్యాపీ సండే’

స్వర్ణాంధ్ర విజన్ ప్రకారం ప్రతి శాఖ నిర్దిష్ఠ లక్ష్యంతో ముందుకెళ్లాలని చంద్రబాబు కోరారు. ప్రతి ఐఏఎస్ అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా త్వరలో విడుదల చేస్తామని సూచించారు. అధికారులందరూ గ్రామస్థాయికి వెళ్లి పర్యటించాలన్నారు. మార్చి లోపు కేంద్రం నుంచి ఎన్ని నిధులు రాబట్టుకోవచ్చో అన్నీ రాబట్టుకోవాలని అన్నారు. గ్రీవెన్స్ ఏ శాఖలో, విభాగంలో ఎక్కువ వస్తే ఆ విభాగం సరిగా పని చేయనట్టే అర్థమని చంద్రబాబు పేర్కొన్నారు. రెవెన్యూ విభాగంలో అర్జీలు ఎక్కువ వస్తున్నాయని, దీనికి గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలే కారణమని విమర్శించారు.ఏపీలో త్వరలో ‘హ్యాపీ సండే.

ప్రజల సంతృప్తి స్థాయిని అన్ని అవకాశాల ద్వారా పెంచాలని సూచించారు. వారికి ఆమోదయోగ్యంగా ఉండేలా మనం పాలన సాగించాలని అన్నారు. ‘మిషన్ కర్మయోగి’ ద్వారా శిక్షణ ఇవ్వడం వల్ల పనితీరు మరింత పెరుగుతుందని, వాట్సాప్ గవర్నెన్స్‌లోనూ అందరూ ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ చేసి అన్ని సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ నెలాఖరు నాటికి ఎవరి దగ్గరా పెండింగ్ ఫైళ్లు ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఫైళ్లు ఆన్‌లైన్‌ విధానంలోకి వచ్చిన తర్వాత క్లియరెన్స్‌కు ఎక్కువ సమయం పట్టకూడదన్నారు. ఆర్థికేతర ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. జీఎస్డీపీలో 15 శాతం వృద్ధి రేటు సాధించగలిగితేనే అనుకున్న లక్ష్యాలు సాధించగలమని, ఆ దిశగా ప్రతి ఒక్కరు పని చేయాలని సూచించారు.

ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టి, అన్ని వర్గాల ప్రజల అవసరాలను తీర్చేలా పాలన సాగించాలనుకుంటోంది. ముఖ్యంగా, పేద ప్రజల స్థితి మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తోంది. “గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తీసుకురావడం ప్రధాన లక్ష్యం,” అని సీఎం చంద్రబాబు చెప్పారు.

ఇతర రాష్ట్రాల వాటితో పోలిస్తే ఏపీ ప్రభుత్వ పాలనా విధానాలు ఎక్కువ ప్రజాకేంద్రీకృతంగా ఉండాలని, ప్రజల సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని బలపరిచేందుకు కొత్త మార్గాలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

మా ప్రభుత్వం రూపొందించిన అభివృద్ధి ప్రణాళికలు ఏపీ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలని, అందులో భాగంగా గ్రామీణ పరిధిలో ఏవైనా సమస్యలు రావడం వల్ల ప్రజలకు అవసరమైన అన్ని సేవలు ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునేలా చూడాలని సీఎం చంద్రబాబు చెప్పారు.

ఈ విధానాలు, ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ తమ ఉద్యోగాలలో మార్పులు తీసుకుని పనులను సమర్ధంగా పూర్తి చేయాలని, అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి సేవల నాణ్యతను పెంచాలని చంద్రబాబు సూచించారు.

Related Posts
త్వరలో డీఎస్సీ పోస్ట్ లు భర్తీ చేస్తాం: లోకేశ్‌
త్వరలో డీఎస్సీ పోస్ట్ లు భర్తీ చేస్తాం: లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో 16,347 ఖాళీ టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో ప్రకటించారు. Read more

8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన
PM Modi to lay foundation stones for various development works in Anakapalle on Jan 8

ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. Read more

ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినిపై యువకుడు అత్యాచారం
rape college student

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. స్నేహం పేరుతో ఓ యువకుడు యువతికి దగ్గరయ్యాడు. మాయమాటలు చెప్పి నమ్మించేందుకు ప్రయత్నించాడు. అదును చూసుకుని యువతిని అత్యాచారం Read more

భారత్‌కు వ్యతిరేకంగా పాక్ , చైనా కుమ్మక్కు : ఆర్మీ చీఫ్
Pakistan, China colluding against India.. Army Chief

న్యూఢిల్లీ: చైనా, పాకిస్థాన్‌లు భారత్‌కు వ్యతిరేకంగా కుమ్మక్కవుతున్నాయని సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండింటి మధ్య ఉన్న కుట్రపూరిత సంబంధాలున్నాయన్న వాస్తవాన్ని Read more