Hamas key statement during Israeli attacks

Hamas: ఇజ్రాయెల్ దాడుల వేళ హమాస్ కీలక ప్రకటన

Hamas: మొదటి దశ కాల్పుల విరమణ ముగిసిన అనంతరం గాజాపై ఇజ్రాయెల్ తీవ్రంగా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. మంగళవారం భారీ వైమాణిక దాడులు చేయడంతో 400 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద సంస్థ హమాస్ కీలక ప్రకటన చేసింది. చర్చలకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని తెలిపింది. కాల్పుల విరమణ అమలు చేయాలని అందుకు గాను ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొంది. కాల్పుల విరమణను తిరిగి అమలు చేసేందుకు హమాస్ సిద్ధంగా ఉంది. కానీ జనవరి 19న అమల్లోకి వచ్చిన ఒప్పందంపై తిరిగి చర్చలు జరపబోము. చర్చలకు ఇంకా సమయం ఉంది. కానీ కొత్త ఒప్పందాలు అవసరం లేదు అని హమాస్ ప్రతినిధి తాహెర్ అల్ నును తెలిపారు.

ఇజ్రాయెల్ దాడుల వేళ హమాస్

గతంలో మాదిరిగానే అగ్రిమెంట్

తమకు ఎటువంటి షరతులూ లేవని, రెండో దశ కాల్పుల విరమణకు వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే అగ్రిమెంట్ ఉండాలని కానీ కొత్త ఒప్పందాలను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. కాగా, ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల ప్రారంభంలో ముగిసింది. అయితే రెండో దశ కాల్పుల విరమణ ఉంటుందని అంతా భావించినప్పటికీ దానికి సంబంధించిన చర్చలు ప్రారంభం కాలేదు. దీంతో మిగిలిన బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ హమాస్‌కు సూచించింది. కానీ హమాస్ దానిని పట్టించుకోకపోవడంతో ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించింది.

Related Posts
బానిసలకే ఆ ఆఫర్.. తేల్చేసిన ట్రంప్
trump

అమెరికా అధ్యక్ష పదవి చేపట్టగానే జన్మతః పౌరసత్వం ఇచ్చే విధానాన్ని రద్దుచేసేసిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దాన్ని సమర్ధించుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైపు ట్రంప్ సర్కార్ Read more

2028 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం నీళ్లు – అమిత్ షా
amithsha ap

రాష్ట్రాన్ని గాడిన పెట్టడంపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. NDRF ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వ Read more

GHMC మినహా అన్ని జిల్లాల్లో 99శాతం సర్వే పూర్తి
Samagra Intinti Kutumba Sur 1

తెలంగాణ రాష్ట్ర సర్కార్ స‌మ‌గ్ర ఇంటింటి కుటుంబ స‌ర్వే చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 09 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే ప్రారంభమైంది. ప్రతి ఇంటికి Read more

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బ‌య్య కన్నుమూత
uke abbai

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *