h1b visa

రెండేండ్ల కాలానికే హెచ్‌-1బీ వీసా!

అమెరికా ఇమ్మిగ్రేషన్‌ విధానంలో కీలక సంస్కరణల దిశగా అడుగులు పడుతున్నాయి. ‘అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పునరుద్ధరణ’ అంశంపై విచారణ చేపట్టిన యూఎస్‌ హౌజ్‌ కమిటీకి సెంటర్‌ ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌ స్టడీస్‌కు చెందిన జెస్సికా ఎం వాఘన్‌ కీలక సంస్కరణలను ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇతర దేశాలకు చెందిన నిపుణులు అమెరికా కంపెనీల్లో పని చేసేందుకు మూడేండ్ల కాలపరిమితితో ఇస్తున్న హెచ్‌-1బీ వీసాలను రెండేండ్లకే ఇవ్వాలని, అవసరమైతే నాలుగేండ్ల కాలానికి మాత్రమే పొడిగించే అవకాశం కల్పించాలని ఆమె సూచించారు. గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారనే కారణంతో ఆటోమేటిక్‌గా హెచ్‌-1బీ వీసాను పొడిగించే విధానాన్ని తొలగించాలని ప్రతిపాదించారు. హెచ్‌-1బీ వీసాల సంఖ్యను సైతం 75 వేలకే పరిమితం చేయాలని సూచించారు. విద్యార్థి వీసాలపై(ఎఫ్‌-1, ఎం-1) అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల నుంచి చదువు పూర్తయిన తర్వాత తిరిగి సొంత దేశాలకు వెళ్తామనే సమ్మతిని తీసుకోవాలని ప్రతిపాదించారు.

గడువు ముగిసినా అమెరికాలోనే..
విద్యార్థి, ఎక్స్ఛ్‌ంజ్‌ వీసాలపై అమెరికాకు వస్తున్న చాలా మంది వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే ఉంటున్నారని జెస్సికా ఎం వాఘన్‌ తెలిపారు. 2023లోనే వీసా గడువు ముగిసినా అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిలో భారతీయులే 7 వేల మంది ఉన్నారని, ఆ తర్వాత బ్రెజిల్‌, చైనా, కొలంబియా దేశస్థులు 2 వేల మంది కంటే ఎక్కువే ఉన్నారని నివేదించారు.

Related Posts
జర్నలిస్టు హత్య కేసు: హైదరాబాద్‌లో నిందితుడి అరెస్టు
జర్నలిస్టు హత్య కేసు: హైదరాబాద్‌లో నిందితుడి అరెస్టు

గత వారం ఛత్తీస్‌గఢ్‌లోని సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం లభించిన జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ హత్యకు సంబంధించి దర్యాప్తు చేస్తూ, ఈ హత్యకు కుట్ర పన్నిన ప్రధాన నిందితుడిని Read more

ఏఐ ట్రాన్స్‌ఫార్మేషన్‌పై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
ఏఐ ట్రాన్స్‌ఫార్మేషన్‌పై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రూపాంతరం కారణంగా డేటా సైంటిస్టులు, ఏఐ ట్రైనర్లు, ఎథికల్ ఏఐ స్పెషలిస్టులకు డిమాండ్ పెరుగుతోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ Read more

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో మోదీ, ఖర్గేల అప్యాయ పలకరింపు
PM, Mallikarjun Kharge's light moment at event to pay tribute to Ambedkar

పార్లమెంట్ ఆవరణలో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య ఆప్యాయ పలకరింపులు అందరినీ ఆకట్టుకున్నాయి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ Read more

యుద్ధ నౌకలు జాతికి అంకితం చేసిన ప్రధాని
Prime Minister Modi dedicated warships to the nation

ముంబయి: భారత నౌకాదళ అమ్ముల పొదిలోకి తాజాగా మరో 3 అస్త్రాలు చేరాయి. ముంబయిలోని నేవల్ డాక్ యార్డులో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరై.. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *