Guntur City Mayor resigns!

Guntur: గుంటూరు నగర మేయర్ రాజీనామా!

Guntur: గుంటూరు నగర మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. నగరకమిషనర్‌ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ప్రతిపక్ష నాయకులు ప్రజలు ఇచ్చిన పదవుల్లో ఉండలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. 2021లో మనోహర్ నాయిడు గుంటూరు మేయర్‌గా ఎన్నికయ్యారు.

Advertisements
గుంటూరు నగర మేయర్ రాజీనామా!

గుంటూరు జిల్లా రాజకీయాల్లో కలకలం

మనోహర్ పదవీ కాలం మరో ఏడాది ఉంది. ఇంతలోనే రాజీనామా చేయడం గుంటూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేగింది. ఆయనకు కొంతకాలంగా నగర కమిషనర్‌ పులి శ్రీనివాసులతో పొసగడం లేదు. ఇద్దరి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఫిబ్రవరిలో జరిగిన గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు జరిగాయి. ఎక్కువ కూటమి సభ్యులు విజయం సాధించారు. దీనికి తోడు కొందరు వైసీపీ కార్పొరేటర్లు కూడా కూటమి పార్టీల్లో చేరారు.

జగన్‌తోనే నడుస్తానని

ఇలా గుంటూరు రాజకీయాలు మారుతున్న టైంలో సోమవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మనోహర్‌పై అవిశ్వాసం పెట్టబోతున్నారని టాక్ నడుస్తోంది. ఈ చర్చ నడుస్తున్న టైంలో మనోహర్‌ రాజీనామా చేశారు. రాజీనామా తర్వాత మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఎన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినా తాను మాత్రం పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు. జగన్‌తోనే నడుస్తానని ప్రకటించారు. ఎప్పటికీ వైసీపీలో ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా అవమానాలు, నిందలు ఎదుర్కొని నిలబడ్డానని ఇకపై నిలబడలేకే పదవి నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు.

Related Posts
Earthquake hits Myanmar : మయన్మార్లో మరోసారి భూకంపం
Maynmar Earthquake:మయన్మార్‌లో మళ్లీ భూకంపం..

మయన్మార్లో భూకంపం మరొకసారి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. మండాలయ్ ప్రాంతానికి 13 మైళ్ల దూరంలో 5.1 తీవ్రతతో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలతో భయంతో Read more

Modi: ఏపీలో ప్రధాని మోదీ పర్యటన..ఎప్పుడంటే !
Narendra Modi శాంతి ప్రయత్నాలను పాక్ విఫలం చేసిందన్న మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి పనులను పునఃప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో, ఈ పర్యటనకు Read more

నేడు తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాలు విడుదల
Telangana Group 1 results released today

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్స్ ఫలితాల విడుదలకు సంబంధించి షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. నేడు గ్రూప్‌-1,ఫలితాలను విడుదల చేయనున్నట్లు కమిషన్‌ తెలిపింది.మొత్తం 563 పోస్టులకు‌గానూ Read more

17న మహాకుంభ మేళాకు లోకేశ్
Minister Nara Lokesh visit to America has ended

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనాల్లో ఒకటైన మహాకుంభమేళా.17న మహాకుంభ మేళాకు లోకేశ్.ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తన కుటుంబంతో కలిసి ఈ నెల 17న ప్రయాగ్ మహాకుంభమేళాకు Read more

×