pawan kalyan

కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో కారుణ్య నియామకాల ప్రక్రియకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కీలక ముందడుగు పడింది. పంచాయతీరాజ్‌ శాఖలో కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు చేరింది. గతంలో ఈ నియామకాలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించి, వెంటనే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. పంచాయతీరాజ్‌ అధికారులు కారుణ్య నియామకాల ఫైల్‌ను ఆర్థికశాఖకు పంపగా, ఆ తర్వాత ఫైల్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే 1,488 మంది పంచాయతీరాజ్‌ ఉద్యోగుల కుటుంబాలకు ఉపశమనం లభించనుంది. కరోనా మహమ్మారిలో రాష్ట్రవ్యాప్తంగా 2,917 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు.

వీరిలో.. 1,944 మంది వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, 330 మంది కలెక్టర్ పరిధిలో ఉన్నవారు ఉన్నారు. 83 మంది యూనివర్సిటీ ఉద్యోగులు, 560 మంది కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులు, ఈ ఉద్యోగులలో 2,744 మంది కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకోగా, 1,149 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. బాధిత కుటుంబాలు పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. వెంటనే పవన్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణమే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌శాఖ ఫైల్ సిద్ధం చేసి ఆర్థికశాఖకు పంపింది, అక్కడి నుంచి ముఖ్యమంత్రి వద్దకు చేరింది. సీఎం ఆమోదముద్రతో కారుణ్య నియామకాల ప్రక్రియ ముగియనుంది. ఈ నిర్ణయం బాధిత కుటుంబాలకు ఎంతో ఊరట కలిగించనుంది.

Related Posts
నేడు పిఠాపురంలో పర్యటించనున్న పవన్ కల్యాణ్
pawan kalyan to participate in palle panduga in kankipadu

అమరావతి: నేడు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గాలలో కూడా డిప్యూటీ సీఎం పర్యటన కొనసాగనుంది. ఈ క్రమంలోనే రెండు Read more

ఏపీకి ప్రధాని మోదీ వరాలు
narendra modi

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్ర అబివృద్దికి కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీకి వరాలు కురిపించనున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతల Read more

2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలి- చంద్రబాబు
Polavaram diaphragm wall

వెలిగొండ ప్రాజెక్టుపై ప్రత్యేక ఫోకస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని అధికారులకు నిర్దేశనలిచ్చారు. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి, నీటి Read more

ఏపీలో మగవారికీ పొదుపు సంఘాలు.. నిబంధనలు ఇవే
Men's Savings

ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే పరిమితమైన పొదుపు సంఘాలను ఇప్పుడు మగవారికీ విస్తరించేందుకు మెప్మా (MEPMA) చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి అధికారులు Read more