KTR

ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండండి : కేటీఆర్..!

హైదరాబాద్‌: ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సోమవారం ఫిరాయింపులపై విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాజ్యాంగం నిర్దేశించిన చట్టం, సుప్రీంకోర్టు ముందస్తు తీర్పులు స్పష్టంగా ఉన్నందున కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారిని రక్షించడం అసాధ్యమన్నారు.

Advertisements
image

ఈ క్రమంలోనే ఉప ఎన్నికలను ఫేస్ చేసేందుకు బీఆర్ఎస్ సైనికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా, బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కేటీఆర్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద వేసిన పిటిషన్లతో కలిపి విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Related Posts
Telengana: భారీ వర్షాలు, వడగండ్లతో చల్లబడిన హైదరాబాద్
Telangana: భారీ వర్షాలు, ఉరుములతో చల్లబడిన హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఆకస్మిక వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయి. శుక్రవారం ఉదయం Read more

జల్లికట్టు పోటీలు షురూ.. గెలిస్తే లక్షల్లో బహుమతి
jallikattu

మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు తమిళుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ గ్రామాల్లో ఉత్సాహపూరిత వాతావరణాన్ని సృష్టించాయి. Read more

విజయ్ దేవరకొండ విడి12 అందరినీ షాక్‌ చేస్తుంది: నాగ వంశీ
విజయ్ దేవరకొండ విడి12 అందరినీ షాక్‌ చేస్తుంది: నాగ వంశీ

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘విడి12’ చిత్రం ద్వారా విజయ్ దేవరకొండ రీ-ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. కొంతకాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల Read more

Retired employees: రిటైర్డ్‌ ఉద్యోగుల తొలగింపుపై సీఎస్‌ శాంతికుమారి తాజా ప్రకటన
Retired Employees: రిటైర్డ్‌ ఉద్యోగుల తొలగింపుపై సీఎస్‌ శాంతికుమారి ప్రకటన

తెలంగాణలో పదవీ విరమణ అనంతరం వివిధ విభాగాల్లో కొనసాగుతున్న విశ్రాంత ఉద్యోగుల తొలగింపు ప్రక్రియపై సీఎస్ శాంతికుమారి ప్రకటన చేశారు. అయితే, ప్రభుత్వ ఉత్తర్వులు ఉత్తముచ్చటేనా? లేక Read more

×