हिन्दी | Epaper
IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్

Gautam Gambhir: దేశం కోసం ఆడాలని క్రీడాకారులకు గంభీర్ సూచన

Anusha
Gautam Gambhir: దేశం కోసం ఆడాలని క్రీడాకారులకు గంభీర్ సూచన

టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మరోసారి తన నిష్కర్షాత్మక వైఖరిని ప్రదర్శించారు. ఇటీవల విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో ఆటగాళ్లు కుటుంబాలను వెంట తీసుకెళ్లడంపై బీసీసీఐ (BCCI) కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గంభీర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్లకు కుటుంబం ముఖ్యమే అయినా, దేశ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. మనం హాలిడే ట్రిప్ కోసం విదేశాలకు రాలేదని,దేశం కోసం ఆడటానికి వచ్చామని అన్నారు. ఏదైనా పర్యటనకు వెళ్లినప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లో చాలా తక్కువ మందితో ఉండాల్సి ఉంటుందని, వారితో పని చేసి దేశం గర్వపడేలా చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుందని గంభీర్ (Gautam Gambhir) చెప్పారు.

తమ అభిప్రాయాలను

కుటుంబానికి సమయం కేటాయించాల్సిందేనని, అయితే, దేశం కోసం ఆడేందుకు వచ్చినప్పుడు మన దృష్టి ఆటపైనే ఉండాలని అన్నారు. తన వరకైతే తనకు ఈ లక్ష్యమే ఎక్కువని చెప్పారు.  మనకు ప్రతిరోజు పోరాటమేనని, దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఇది తప్పదని గంభీర్ అన్నారు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉంటుందని, డ్రెస్సింగ్ రూమ్ కల్చర్ గురించి కూడా మాట్లాడుకోవచ్చని చెప్పారు. మన విజయాలలో కుటుంబాల పాత్ర ఎక్కువగా ఉంటుందని అన్నారు. చటేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) తో ముఖాముఖిలో గంభీర్ ఈ మేరకు తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆటగాళ్ల దృష్టి పూర్తిగా క్రికెట్‌పైనే ఉండాలని గంభీర్ అభిప్రాయపడ్డారు. “ఒకసారి బరిలోకి దిగాక మన ప్రాధాన్యత ఆటపైనే ఉండాలి.

Gautam Gambhir: దేశం కోసం ఆడాలని క్రీడాకారులకు గంభీర్ సూచన
Gautam Gambhir: దేశం కోసం ఆడాలని క్రీడాకారులకు గంభీర్ సూచన

ప్రత్యేకించి

డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా తక్కువ మంది ఉంటారు. వారి మధ్య కట్టుదిట్టమైన ఐక్యత అవసరం. దేశం కోసం పోరాడాలన్న తపన ప్రతి ఒక్కరిలో ఉండాలి” అని చెప్పారు.బీసీసీఐ ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం, విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు పరిమిత అనుమతి మాత్రమే ఉంటుంది. ప్రత్యేకించి లాంగ్ టూర్‌ (Long tour) ల సమయంలో ఆటపై దృష్టి మరలకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.గంభీర్ ఎప్పుడూ డిసిప్లిన్, నిబద్ధతకు ప్రసిద్ధి. ఆటగాళ్లు జట్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని అతను స్పష్టం చేశారు. “దేశం కోసం ఆడటమే గొప్ప గౌరవం, అది ఆటగాళ్ల ప్రాధాన్యత కావాలి,” అని అన్నారు.

గౌతమ్ గంభీర్ ఎవరు?

గౌతమ్ గంభీర్ భారత మాజీ క్రికెట్ ఆటగాడు, రాజకీయ నాయకుడు, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్. వాడే మూడో స్థానంలో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా భారత్‌కు ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

గౌతమ్ గంభీర్ ఎప్పుడు పుట్టారు?

గంభీర్ 14 అక్టోబర్ 1981న న్యూ ఢిల్లీలో జన్మించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Shubhman Gill: భారత వన్డే జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపిక?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870