Gaddam Prasad : స్పీకర్ గడ్డం ప్రసాద్ కౌంటర్కు సభలో కొద్దిసేపు నవ్వులు తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రోడ్ల నిర్మాణంపై చర్చ జరుగుతున్న సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులపువ్వులా విరిసాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మధ్య రోడ్ల నిర్మాణంపై తీవ్ర చర్చ సాగింది.

రోడ్లపై హరీశ్ రావు, కోమటిరెడ్డి వాగ్వాదం
తెలంగాణలో తమ హయాంలో విస్తృతంగా రోడ్లు వేశామని హరీశ్ రావు పేర్కొన్నారు. అయితే, దీనికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం తెలిపారు.
మీ ప్రభుత్వం వేశిన రోడ్లు ఇక్కడే కనిపించడం లేదే… ప్రజలు ఇంకా తిప్పలు పడుతున్నారు అంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో సభలో కొద్దిసేపు రగడ కొనసాగింది.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కౌంటర్ – సభలో నవ్వుల వర్షం
ఈ హీట్డ్ డిస్కషన్ మధ్య స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘మా వికారాబాద్ జిల్లాలో రోడ్లు లేకపోవడంతో అబ్బాయిలకు పెళ్లిళ్లు కుదరడం లేదు అని వ్యాఖ్యానించారు. ఆ మాట వినగానే సభలో ఒక్కసారిగా నవ్వుల పండగ జరిగింది. బీఆర్ఎస్ సభ్యులు తల ఊపుకోగా, కాంగ్రెస్ సభ్యులు “షేమ్ షేమ్” అంటూ నినాదాలు చేశారు.తన ప్రభుత్వ హయాంలో పాత మండలాల ప్రాతిపదికన అన్ని ప్రాంతాల్లో రోడ్లు వేశామని హరీశ్ రావు సమర్థించుకున్నారు. అయితే, కాంగ్రెస్ సభ్యులు దీనిని తప్పుబట్టారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం మరింత రసవత్తరంగా మారింది.
సభలో హైలైట్ అయిన స్పీకర్ వ్యాఖ్యలు
స్పీకర్ చేసిన ఈ సరదా కామెంట్ సభలో హైలైట్గా మారింది. సామాన్య ప్రజలకు సంబంధించి సైతం రోడ్ల సమస్య ఎంత కీలకమో ఈ వ్యాఖ్య ద్వారా స్పష్టమవుతోంది. చివరికి, ఈ చర్చకు ముగింపు పడినా, స్పీకర్ మాటలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.