हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు

Divya Vani M
జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిఠాపురం రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అధికార పార్టీకి గుడ్‌బై చెప్పి, జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ రోజు (శుక్రవారం) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా దొరబాబుకు పార్టీ కండువా కప్పి, జనసేనలోకి ఘనంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో జనసేన కీలక నేతలు హాజరయ్యారు. ముఖ్యంగా, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన శాసనమండలి విప్ హరిప్రసాద్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దొరబాబు జనసేన తీర్థం పుచ్చుకోవడం పిఠాపురం రాజకీయాల్లో కొత్త మార్పులకు దారి తీసేలా కనిపిస్తోంది.

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు

దొరబాబు జనసేనలో చేరడమే కాకుండా, ఆయన వెంట పలువురు వైసీపీ నేతలు కూడా పార్టీ మారారు. ఇంaదులో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కొత్తపల్లి పద్మ బుజ్జి, గొల్లప్రోలు మార్కెట్ కమిటీ చైర్మన్ మొగిలి వీర వెంకట సత్యనారాయణ లాంటి ప్రముఖులు ఉన్నారు. వీరందరికీ నాదెండ్ల మనోహర్ పార్టీ కండువాలు కప్పి, జనసేనలోకి ఆహ్వానించారు.పిఠాపురంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్న నేపథ్యంలో, ఈ చేరికలు జనసేనకు మరింత బలాన్ని అందించనున్నాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో జనసేన పోటీ చేయలేదు.

కానీ ఈసారి దొరబాబు వంటి సీనియర్ నేత జనసేనలో చేరటం, పార్టీలోకి మరికొందరు కీలక నేతలు రావడం, స్థానిక రాజకీయాల్లో భారీ మార్పుకు సంకేతాలు ఇస్తున్నాయి.పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జనసేన శరవేగంగా విస్తరిస్తోందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్న జనసేన, 2029 ఎన్నికలకు ముందు పిఠాపురంలో మరిన్ని కీలక చేరికలను చేపట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి, ప్రస్తుతం ఏపీలో జనసేన ప్రభావం గణనీయంగా పెరుగుతున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దొరబాబు వంటి నాయకుల చేరికలు ఈ పార్టీ బలాన్ని మరింత పెంచే అవకాశముంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870