విచారణకు హాజరైన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌

విచారణకు హాజరైన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌

అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ విజయవాడ పోలీసుల విచారణకు హాజరయ్యారు. అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో విచారణకు ఆయన వచ్చారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు గోరంట్ల మాధవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బాధితుల వివరాలు వెల్లడించారంటూ గతేడాది నవంబర్‌ 2న చేసిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పీఎస్‌లో పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు.

Advertisements
విచారణకు హాజరైన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌

50కిపైగా వాహనాల భారీ కాన్వాయ్‌తో

కాగా, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను బుధవారం విచారణ నిమిత్తం విజయవాడ రావాలని కొద్దిరోజుల కిందట పోలీసులు 41ఏ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. బెజవాడ వెళ్తున్నట్లు బుధవారం ఆయన భారీ బిల్డప్‌ ఇచ్చారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున అనంతపురంలోని మాధవ్‌ ఇంటికి చేరుకున్నారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా వారిలో ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 50కిపైగా వాహనాల భారీ కాన్వాయ్‌తో మాధవ్‌ నగరంలో బలప్రదర్శన చేశారు. వైఎస్‌, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంఘీభావం తెలుపడానికే వైసీపీ నాయకులు

అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు విచారణకు హాజరవుతానని.. తనకు వేరే కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో.. గురువారం వస్తానని చెప్పానని తెలిపారు. ‘బలప్రదర్శనతో వెళ్తున్నారా..? విజయవాడకు వెళ్లేందుకు ఒకట్రెండు రోజులు పడుతుందా..’ అని మీడియా ప్రశ్నించగా… తాను విచారణకు వెళ్తున్నాననే సమాచారంతో సంఘీభావం తెలుపడానికే వైసీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చారని బదులిచ్చారు. విజయవాడ పోలీసులు తనకు నోటీసులు అందజేసిన రోజు ‘అంతర్యుద్ధం వస్తుంది’ అని తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.

Related Posts
Waqf Amendment Bill : రాజ్యసభ లో వక్స్ బిల్లుకు ఆమోదం
Waqf Amendment Bill 2

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వక్స్ (Waqf) సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు రావడంతో పాటు, వ్యతిరేకంగా 95 ఓట్లు Read more

Nirmala Sitharaman : జమిలి ఎన్నికలు 1.5 శాతం పెరుగుదల : నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman జమిలి ఎన్నికలు 1.5 శాతం పెరుగుదల నిర్మలా సీతారామన్

దేశంలో జమిలి ఎన్నికలపై చర్చలు మళ్లీ వేగం పెంచుతున్నాయి అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. చెన్నైలో జరిగిన ఓ Read more

RRR బిహైండ్ అండ్ బియాండ్ రివ్యూ
RRR బిహైండ్ అండ్ బియాండ్ రివ్యూ

జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నటించిన ఎస్.ఎస్. రాజమౌళి యొక్క అద్భుతమైన చిత్రం RRR యొక్క మేకింగ్‌ దృశ్యపరంగా ఆకర్షణీయమైన, కానీ కొంత సాధారణమైన డాక్యుమెంటరీగా Read more

Marri Rajasekhar: వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరిక
Marri Rajasekhar: వైసీపీకి గుడ్‌బై - టీడీపీలో చేరనున్న మర్రి రాజశేఖర్!

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి పెరిగిన నేపథ్యంలో పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ వైపు అడుగులు Read more

×