బీహార్ రాజధాని పాట్నా (Patna is the capital of Bihar) లో జరిగిన ఓ అత్యంత దారుణ ఘటన ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. నేపాల్కు చెందిన యువతిపై ఓ ప్రైవేట్ బస్సులో దారుణమైన అత్యాచారం (Brutal rape in a private bus) జరిగింది. అయితే, ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి, ప్రధాన నిందితుడితో పాటు మరోకరిని అరెస్ట్ చేసి కేసును ఛేదించారు.ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన కార్తీక్ రాయ్కు నేపాలీ భాష వచ్చు. అదే ఆయనకు నమ్మకాన్ని తెచ్చే ఆయుధంగా మారింది. బాధితురాలికి సాయం చేస్తానంటూ , చివరకు ఆమెను మోసం చేశాడు. కార్తీక్కి కుటుంబం ఉంది. ఒక కుమారుడూ ఉన్నాడు. అయినా ఈ పని చేసిన తీరు పోలీసులకే షాక్ ఇచ్చింది.ఆగస్టు 3న బాధితురాలు నేపాల్ నుంచి సిలిగురి మీదుగా పాట్నాకు వచ్చింది. పాటలీపుత్ర రైల్వే స్టేషన్లో ఆమెను కార్తీక్ కలిశాడు. “ఉద్యోగం ఇప్పిస్తాను” అనే మాటలతో ఆమెను నమ్మించి సునీల్ కుమార్ అనే వ్యక్తి ఇంటికి తీసుకెళ్లాడు. తర్వాత ఆమెను బస్సులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
నేరం తర్వాత ప్లాన్ చేసిన పారిపోవడం
అత్యాచారానికి పాల్పడిన తర్వాత కార్తీక్ మరియు సునీల్ ఇద్దరూ పాట్నా నుంచి పారిపోయారు. బస్సును పూర్తిగా శుభ్రం చేసి, సాక్ష్యాలను తొలగించే ప్రయత్నం చేశారు. బాధితురాలికి చెందిన వస్తువులు దోచి, వాటిలో కొన్నింటిని కోల్కతాలో విక్రయించాడట.కార్తీక్ రాయ్ పశ్చిమ బెంగాల్కు పారిపోవడానికి రైల్లో ప్రయాణిస్తుండగా బరౌనీ వద్ద పోలీసులు అతడిని పట్టుకున్నారు. అతని వద్ద బాధితురాలి గుర్తింపు కార్డు, నేపాలీ సిమ్ కార్డు, ఇతర వ్యక్తిగత వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాలతో సునీల్ కుమార్ను ఔరంగాబాద్లో అరెస్ట్ చేశారు.
బాధితురాలికి మానవత్వం చూపిన స్థానికులు
గాంధీ మైదాన్ సమీపంలో ఏడుస్తున్న బాధితురాలిని స్థానికులు గమనించారు. వారు వెంటనే గోర్ఖా రెజిమెంట్ జవాన్ల సహకారంతో ఆమెకు సాయం చేశారు. గోర్ఖా సమాజ్ సమితి అధ్యక్షుడు సూరజ్ థాపా మానవతా దృష్టితో ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆమెకు సహాయం చేశారు.పోలీసులు ఈ ఘటనలో ఉపయోగించిన ప్రైవేట్ బస్సును స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఇంకెవరికైనా సంబంధముందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కఠిన శిక్షే బాధితురాలికి చిన్న న్యాయం కానుంది.
Read Also : Virat Kohli : లండన్లో ప్రాక్టీసు మొదలెట్టిన కింగ్ కోహ్లీ