For what reason was I suspended.. Jagadish Reddy

Jagadish Reddy: నన్ను ఏ కారణంతో సస్పెండ్‌ చేశారు: జగదీశ్‌రెడ్డి

Jagadish Reddy: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పై ఈనెల 27 వరకు బడ్జెట్‌ సమావేశాలకు హాజరుకాకుండా వేటు పడిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సోమవారం ఆయన అసెంబ్లీకి వచ్చారు. దీంతో సభ లోపలికి వెళ్లకుండా జగదీశ్‌ రెడ్డిని చీఫ్‌ మార్షల్ అడ్డుకున్నారు. అనంతరం జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాలను ఇష్టారీతిన నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీకి రావొద్దనడానికి ఎలాంటి ఆంక్షలు ఉన్నాయని ప్రశ్నించారు.

నన్ను ఏ కారణంతో సస్పెండ్‌ చేశారు

ప్రభుత్వ అరాచకత్వానికి ఇది పరాకాష్ట

నన్ను ఏ కారణంతో సస్పెండ్‌ చేశారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి బులెటిన్‌ విడుదల చేయలేదు. సస్పెండ్‌ చేశారో, లేదో కనీసం ఆధారాలు లేవు. బులెటిన్‌ ఇస్తే నేను రాను. లేదంటే సభాపతిని కలుస్తా. నేను కోర్టుకు వెళ్తానన్న భయంతో బులెటిన్‌ ఇవ్వట్లేదు. ఎలాంటి రాజ్యాంగ విలువలు, నిబంధనలు పాటించకుండా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అరాచకత్వానికి ఇది పరాకాష్ట. మంత్రులు జవాబివ్వలేక .. ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నారు. దావత్‌లకు కూడా మంత్రులు ప్రభుత్వ హెలికాప్టర్లలో వెళ్తున్నారు అని జగదీశ్‌ రెడ్డి దుయ్యబట్టారు.

Related Posts
Marri Rajasekhar: వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరిక
Marri Rajasekhar: వైసీపీకి గుడ్‌బై - టీడీపీలో చేరనున్న మర్రి రాజశేఖర్!

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి పెరిగిన నేపథ్యంలో పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ వైపు అడుగులు Read more

ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం: మంత్రి
uttam

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులో ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఈ పథకం Read more

సీఎం రేవంత్‌తో మీనాక్షి నటరాజన్ భేటీ
Meenakshi Natarajan meets CM Revanth

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌ రెడ్డిని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ బుధవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వచ్చిన ఏఐసీసీ Read more

మన్మోహన్ సింగ్ అస్తికల నిమజ్జనానికి హాజరుకాని కాంగ్రెస్?
మన్మోహన్ సింగ్ అస్తికల నిమజ్జనానికి హాజరుకాని కాంగ్రెస్?

కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ అస్తికల నిమజ్జనానికి ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇచ్చింది. అంత్యక్రియల అనంతరం, కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ మరియు ప్రియాంక గాంధీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *