For the first time in the country, the Prime Minister will be provided security with women

దేశంలోనే తొలిసారి.. మహిళలతోనే ప్రధానికి భద్రత

న్యూఢిల్లీ : రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా గుజరాత్‌ లోని నవ్‌సారీ జిల్లాలో నిర్వహించబోయే ఉమెన్స్‌ డే వేడుకలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి మహిళా పోలీసులే భద్రత కల్పించనుండటం విశేషం. ప్రధాని పాల్గొనే ఈ ఈవెంట్‌లో కేవలం మహిళా పోలీసు సిబ్బందితో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి హర్ష్‌ సంఘవి తెలిపారు. హెలిప్యాడ్‌ నుంచి వేదిక వరకూ ప్రధాని మోడీ భద్రతా ఏర్పాట్లను మహిళా పోలీసులు మాత్రమే నిర్వహిస్తారని వెల్లడించారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి కేవలం మహిళా పోలీసులే పహరా కాయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.

Advertisements
దేశంలోనే తొలిసారి మహిళలతోనే ప్రధానికి

2,300 మందికి పైగా మహిళా పోలీసులు

ఇక, ఈ కార్యక్రమానికి భద్రత కల్పించేవారిలో ఐపీఎస్‌ అధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకూ 2,300 మందికి పైగా మహిళా పోలీసులు ఉంటారని మంత్రి తెలిపారు. అందులో 2,100 మందికిపైగా కానిస్టేబుళ్లు, 187 మంది ఎస్సైలు, 61 మంది పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లు, 16 మంది డీఎస్పీలు, ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీ, ఒక అదనపు డీజీపీ ఉంటారని మంత్రి వివరించారు. సీనియర్‌ మహిళా ఐపీఎస్‌ అధికారిణి, హోంశాఖ కార్యదర్శి అయిన నిపుణా తోరావణే భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చొరవ మహిళా దినోత్సవం నాడు ప్రపంచానికి మంచి సందేశాన్ని ఇస్తుందని, గుజరాత్‌ను సురక్షితమైన, భద్రమైన రాష్ట్రంగా మార్చడంలో మహిళలు ఎలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారో కూడా ఈ కార్యక్రమం తెలియజేస్తుందని పేర్కొన్నారు.

Related Posts
తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు ఆకస్మిక వరదలు
cyclone 1

తెలుగు రాష్ట్రాల ప్రజలను ఫెంగాల్ తుఫాను వణికిస్తోంది. ముఖ్యంగా తుపాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తెలంగాణలోని పలు Read more

దేశంలో సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు
Chandrababu Naidu is the richest Chief Minister in the country

న్యూఢిల్లీ: దేశంలోనే ధనిక సీఎంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చివరి స్థానంలో నిలిచారు. అసోసియేషన్‌ Read more

ఏపీలో అతి తీవ్ర భారీ వర్షాలు పడే ఛాన్స్
imd warns heavy rains in ap and tamil nadu next four days

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఫెంగల్' తుఫాన్ గడిచిన 6గంటల్లో 10 కిమీ వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. పుదుచ్చేరికి 100 కి.మీ, చెన్నైకి 100 కి.మీ. దూరంలో Read more

Google: గూగుల్ ఉద్యోగులకు ఇకపై నో వర్క్ ఫ్రొం హోమ్..
గూగుల్ ఉద్యోగులకు ఇకపై నో వర్క్ ఫ్రొం హోమ్..

టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ ఉద్యోగులకు ఒక హెచ్చరిక జారీ చేసింది. ఏంటంటే వర్క్ ఫ్రొమ్ హోమ్ చేసే ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసుకి రావాలని, ఒకవేళ అలా Read more

Advertisements
×