గాజా (Gaza) లో పరిస్థితులు చెల్లాచెదురుగా మారాయి. ఇజ్రాయెల్ దాడుల వలన అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువులు లభించక, కొరత తీవ్రంగా పెరిగింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆహారం, ఇంధనం, ఔషధాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.యుద్ధ పరిస్థితుల కారణంగా గాజాలో బ్యాంకులు, ఏటీఎంలు పని చేయడం లేదు. దీంతో నగదు అవసరమైన వారు దళారులను ఆశ్రయిస్తున్నారు. వీరిలో కొందరు 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. కేవలం ఓ కిలో బియ్యం కోసం జనం తమ ఆభరణాలు అమ్ముకుంటున్నారు.

షెకెల్ వినియోగంపై ఆంక్షలు – మారిన లావాదేవీలు
గాజాలో ఎక్కువగా ఇజ్రాయెల్ కరెన్సీ షెకెల్ వాడతారు. కానీ టెల్ అవివ్ ప్రభుత్వం షెకెల్ లావాదేవీలను ఆపేసింది. దీంతో ప్రజలు డాలర్కే మొగ్గు చూపుతున్నారు. మధ్యవర్తులు షెకెల్ను డాలర్లోకి మార్చేందుకు భారీ వడ్డీ వసూలు చేస్తున్నారు.ఒక మెడికల్ షాపు యజమాని షాహిద్ అజ్జూర్ (Owner Shahid Azjur) ఏమన్నారంటే, ‘‘ఔషధాలు కొనేందుకు బంగారాన్ని కూడా అమ్మేశాను. ఇప్పుడిప్పుడే బతుకుదెరువు సాధ్యపడుతోంది’’ అని వాపోయాడు. ప్రజలు తమ ముడుపులు పెట్టిన ఆస్తుల్ని విక్రయించక తప్పడం లేదని ఆయన చెప్పారు.
ద్రవ్యోల్బణం భయంకర స్థాయికి చేరింది
గతంలో రెండు రోజులకు నాలుగు డాలర్లు సరిపోతే, ఇప్పుడు అదే వ్యవధికి 12 డాలర్లు కావాలని ఒక స్థానికుడు వాపోయాడు. చక్కెర ధర కిలోకి 2 డాలర్లు ఉండగా, ఇప్పుడు అది 100 డాలర్ల వరకు చేరిందని చెప్పాడు. పెట్రోల్ లీటర్ ధర కూడా 25 డాలర్లకు ఎగబాకిందని వివరించాడు.సంపన్న వర్గాలు ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయాయి. గాజాలో ఉన్న మధ్యతరగతి ప్రజలు మాత్రం చిక్కుల్లో ఉన్నారు. యుద్ధం కేవలం భయాన్ని కాక, ఆకలిని కూడా తెచ్చిందని వారు బాధపడుతున్నారు.
Read Also : Joe Root : లార్డ్స్ లో రూట్ సెంచరీ… బుమ్రాకు 4 వికెట్లు