Focus on women's safety: YS Jagan

మహిళల భద్రతపై దృష్టి సారించండి : జగన్

పీలేరు యాసిడ్ దాడిని ఖండించిన వైఎస్ జగన్‌

అమరావతి : అన్నమయ్య జిల్లా పీలేరులో యువతిపై జరిగిన యాసిడ్ దాడి ఘటనపై మాజీ సీఎం జగన్ ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితరాలికి అండగా ఉండాలని మెరుగైన వైద్యం అందించాలని జగన్ సూచించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ట్వీట్టర్ వేదికగా మండిపడ్డారు. ఇకనైనా మహిళల భద్రతపై దృష్టిసారించాలని ప్రభుత్వానికి సూచించారు.

మహిళల భద్రత పై దృష్టి

ప్రేమ పేరుతో వేధించి యువతిపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది. దీంతో, వెంటనే బాధితురాలిని మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చికిత్స అందిస్తున్నారు. వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లెకు చెందిన గౌతమిపై ప్రేమోన్మాది గణేష్‌ యాసిడ్‌ దాడి చేశాడు. ఆమె తలపై కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్‌ పోశాడు.

దీంతో, బాధితురాలు విలవిల్లాడిపోయింది. ఈ క్రమంలో వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇటీవలే సదరు యువతి కి వివాహం నిశ్చయం అయ్యింది. ఏప్రిల్‌ 29న ఆమెకు పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్‌తో పెళ్లివివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే యువతి పెళ్లిపై గణేష్‌ రగిలిపోయాడు. దీంతో ఆమెపై దాడికి పాల్పడ్డాని తెలుస్తోంది.

Related Posts
జగన్ కేసులపై విచారణ వాయిదా
అసెంబ్లీకి హాజరు కాకూడదని జగన్ నిర్ణయం

మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుల్లో సీబీఐ, ఈడీలు తన పరిశోధన వివరాలను నిన్న కోర్టులో ఫైల్ Read more

ఎంపీడీవోను పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌
kalyan

వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఎంపీడీవో జవహర్‌బాబును డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ శనివారం పరామర్శించారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా గాలివీడులో జరిగిన Read more

నేడే కేంద్ర బడ్జెట్
union budget 2025 26

ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2025ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈ Read more

తమిళనాడు ప్రజలకు సీఎం స్టాలిన్‌ కీలక విజ్ఞప్తి
Have babies immediately.. MK Stalin advice to Tamil people amid delimitation row

చెన్నై: సీఎం ఎంకే స్టాలిన్‌ తమిళనాడు ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ప్రజలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్న కుటుంబ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *