fire accident in kphb colony hyderabad

కేపీహెచ్‌బీలో ఘోర అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీ కాలనీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ టిఫిన్ సెంటర్‌లో అర్ధరాత్రి ఒక్కసారిగా చెలరేగిన మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 2 బైకులు, హోటల్ ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు కనుమ పండుగ వేళ ఖమ్మం పత్తి మార్కెట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి మార్కెట్‌ యార్డ్‌ షెడ్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో షెడ్‌లో నిల్వచేసిన పత్తి బస్తాలు తగలబడిపోయాయి. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే ఈ అగ్నిప్రమాదంలో మర్కెట్‌ గోడౌన్‌లో ఉంచిన 400 పత్తి బస్తాలు మంటల్లో దగ్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే పత్తి మార్కెట్‌కు సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 16 వరకు సెలవులు ఉన్నాయి. పండుగకు ముందు కొందరు వ్యాపారులు రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేసి మార్కెట్ యార్డులో ఉంచారు. కానీ ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో పత్తి బస్తాలు కాలిపోవడంతో వ్యాపారులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.

అగ్నిప్రమాదం ఎలా జరిగింది అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో పత్తి బస్తాలు దగ్ధమైనప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదం జరగడంతో మార్కెట్‌కు వచ్చిన రైతులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు తమను ప్రభుత్వం ఆదుకోవాలని పత్తి రైతులు కోరుతున్నారు.

Related Posts
ఏపీలో అర్హులైన అందరికి త్వరలో నూతన రేషన్ కార్డులు
New ration cards for all eligible in AP soon

అమరావతి: రేషన్ కార్డు లేని అర్హులైన పేదలకు త్వరలోనే వాటిని మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్‌కార్డుల్లో పేరు మార్పు చేర్పులకు కూడా అవకాశం ఇవ్వనుంది. Read more

విశాల్ అనారోగ్యానికి కారణం ఆ సినిమానేనా..?
hero vishal

తమిళ స్టార్ హీరో విశాల్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'మదగదరాజ' సినిమా ఈవెంట్ లో ఆయన వణుకుతూ కనిపించారు. దీంతో, ఆయన Read more

బండి సంజయ్ పై టీపీసీసీ చీఫ్ ఫైర్
mahesh kumar

తెలంగాణ రాజకీయాల్లో రోజు రోజుకు మరింత ఉద్ధృతమవుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ను పాకిస్థాన్ క్రికెట్ Read more

ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్న మోదీ
ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్న మోదీ

న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ నుండి భారతీయ ప్రవాసుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. Read more