అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆర్థిక సంవత్సరం

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై అందరి దృష్టీ నెలకొంది. ఆమె వరుసగా ఎనిమిదో సారి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం విశేషం. ఈ రికార్డు ఇప్పటికే ఆమె పేరుతో ఉంది. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను ఊరట.. రైతులకు వరాలు.. మహిళలకు లబ్ధి వంటి వరాలు ఉండొచ్చన్న అంచనాలతో సహా పరిశ్రమ వర్గాల నుంచి కూడా పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. క్యాలెండర్ ఇయర్‌ను ఆర్థిక సంవత్సరంగా మార్చాలని పలువురు పన్ను నిపుణులు సూచిస్తున్నారు. బడ్జెట్‌లోనే దీనిపై ప్రకటన చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ ఎందుకు తెస్తున్నారు.. వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండొచ్చు.. ఏం లాభాలు ఉండొచ్చు.

మన దేశంలో ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మరుసటి సంవత్సరం మార్చి 31 వరకు ఉంటుంది. ఇతర చాలా దేశాల్లో క్యాలెండర్ ఇయర్ అయిన జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉన్న దానినే ఆర్థిక సంవత్సరంగా కూడా పరిగణిస్తున్నాయి. మన దగ్గరే ఇలా క్యాలెండర్ ఇయర్, ఆర్థిక సంవత్సరం వేర్వేరుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. మన దగ్గర కూడా ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలని కోరుతున్నారు. ఇలా ఆర్థిక సంవత్సరాన్ని క్యాలెండర్ ఇయర్‌కు మార్చినట్లయితే.. పాలనా సామర్థ్యం పెరగడంతో పాటు.. వ్యక్తులకు, వ్యాపారులకు మరింత స్పష్టత కూడా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో మల్టీ నేషనల్ కంపెనీలకు (బహుళ జాతి కంపెనీలు), NRI లకు కూడా ఈ విధానం అనువుగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇంకా క్యాలెండర్ ఇయర్‌కు అనుగుణంగా పన్ను గడువు తేదీలు, ఆర్థిక ప్రణాళికలు చేసుకునేందుకు వీలుగా ఉంటుందని చెబుతున్నారు.

Related Posts
Liquor Scam Protest: పోలీసుల అదుపులో తమిళిసై
tamilisai arrest

తమిళనాడులో టాస్మాక్ (TASMAC) లిక్కర్ స్కామ్ పై బీజేపీ చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టాస్మాక్ ద్వారా భారీ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో, రాష్ట్రవ్యాప్తంగా Read more

ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే కూల్చివేయాల్సిందే: సుప్రీంకోర్టు
Amaravati capital case postponed to December says supreme court jpg

Supreme Court న్యూఢిల్లీ: ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేస్తూ Read more

కేజీవాల్ ఓటమికి 2 కారణాలు – పీసీసీ చీఫ్
mahesh delhi

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజీవాల్ పరాజయానికి రెండు ప్రధాన కారణాలను Read more

Narendra Modi :మేం కోరేది స్నేహమే శత్రుత్వం కాదు :మోదీ
Narendra Modi :మేం కోరేది స్నేహమే శత్రుత్వం కాదు :మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మెన్‌తో జరిగిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. భారత్-చైనా సంబంధాలు, Read more