fake currency racket busted

శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్లు కలకలం

శ్రీకాకుళం జిల్లాలో ఒకే రోజు నకిలీ నోట్లు చలామణి చేస్తున్న రెండు ముఠాలు పట్టుబడటం జిల్లా వ్యాప్తంగా కలకలాన్ని రేపింది. టెక్కలి డీఎస్పీ మూర్తి, సీఐ అవతారం ఈ ఘటనల వివరాలను మీడియాకు వెల్లడించారు. నకిలీ నోట్ల తయారీ, చలామణి వెనుక ఉన్న గ్యాంగ్‌ల గురించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

మెళియాపుట్టి మండలానికి చెందిన తమ్మిరెడ్డి రవి వద్ద రూ.50వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతని సమాచారం మేరకు పలాస, మెళియాపుట్టి, వజ్రకొత్తూరు ప్రాంతాలకు చెందిన మరికొందరిని అరెస్టు చేశారు. వారి వద్ద రూ.57.25 లక్షల నకిలీ నోట్లు, కలర్ ప్రింటర్, సెల్ ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు దాసరి రవికుమార్ నిందితుడిగా ఉండడం చర్చనీయాంశమైంది.

ఇక జి సిగడాం మండలం పెనసాం కూడలిలో ద్విచక్ర వాహనంపై నకిలీ నోట్లు తరలిస్తున్న గనగళ్ల రవి, లావేరుకు చెందిన రాజేశ్‌లు పట్టుబడ్డారు. ఒడిశాలోని పర్లాఖెముండి, గుణుపురం ప్రాంతాల నుంచి నకిలీ నోట్లను తెచ్చి చెలామణి చేస్తున్నారు. వారు మరింత సంపాదించాలని నోట్ల తయారీకి రసాయనాలు కూడా కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు రూ.15 లక్షల నకిలీ నోట్లు లభ్యమయ్యాయి. ఈ కేసులో ప్రతాప్ రెడ్డి, కృష్ణమూర్తి వంటి ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Related Posts
నేడు సూర్యాపేటలో పర్యటించనున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ
Governor Jishnu Dev Varma will visit Suryapet today

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మూడురోజుల పర్యటనలో భాగంగా ఈ ఉదయం సూర్యాపేట జిల్లాలో సందర్శనకు వెళ్లనున్నారు. జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశానికి Read more

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి తప్పిన ప్రమాదం
Accident in Minister Uttam Kumar Chonvoy in Garidepalle in Suryapet

హుజూర్‌నగర్‌: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ శుక్రవారం ప్రమాదానికి గురైంది. ఉత్తమ్ తన నియోజకవర్గమైన హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలకు Read more

దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఛార్జీలు:జెన్జో అంబులెన్స్
దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఛార్జీలు జెన్జో అంబులెన్స్

దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఛార్జీలు:జెన్జో అంబులెన్స్ దేశవ్యాప్తంగా అత్యవసర ఆరోగ్య సేవలను మరింత వేగంగా అందించేందుకు జెన్జో ఓ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. సాధారణ క్యాబ్ సేవల Read more

సామ్‌సంగ్ షేర్లు 4 సంవత్సరాల కనిష్టానికి చేరాయి
samsung india gst investigation

సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు ఈ సంవత్సరం 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం, ఈ సంవత్సరం టీఎస్‌ఎమ్‌సీ (TSMC) మరియు ఎన్విడియా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *