हिन्दी | Epaper

President’s Rule : మణిపుర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు

Sudheer
President’s Rule : మణిపుర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు

మణిపుర్లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ (Biren Singh) రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాలన రద్దయ్యి, రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. మణిపుర్లో శాంతి భద్రతలు దిగజారడం, తెగల మధ్య ఘర్షణలు, పరస్పర ద్వేషాలు తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రపతి పాలనకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.

పాలన పొడిగింపు తీర్మానం: పార్లమెంట్‌లో ఆమోదం

తాజాగా కేంద్ర ప్రభుత్వం మణిపుర్లో రాష్ట్రపతి పాలన(President’s Rule)ను మరింత పొడిగించాలని నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో ఈ విషయంపై తీర్మానం ప్రవేశపెట్టగా, దానికి సభ ఆమోదం తెలిపింది. దీనివల్ల మణిపుర్లో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. తద్వారా వచ్చే ఫిబ్రవరి 2026 వరకు ఆ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే కొనసాగుతుంది.

రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి

మణిపుర్లో ప్రస్తుతం ఎన్నికల సూచనలు కనిపించకపోవడంతో అక్కడి ప్రజలు భవిష్యత్తు పాలనపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శాంతి స్థాపన, పరస్పర సమన్వయం వంటి అంశాలపై కేంద్రం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు మరోసారి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి పాలన పొడిగింపుతో అక్కడి రాజకీయ పరిస్థితులు తాత్కాలికంగా స్థిరమైనప్పటికీ, దీర్ఘకాలిక పరిష్కారాలు మాత్రం ఇప్పటికీ చిక్కులోనే ఉన్నాయి.

Read Also : Telangana Secretariat : సచివాలయంలో ఊడిపడిన పెచ్చులు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

రైళ్ల వేళల్లో మార్పు: ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక సూచన!

రైళ్ల వేళల్లో మార్పు: ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక సూచన!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : స్త్రీ శక్తికి పాదాభివందనం!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : స్త్రీ శక్తికి పాదాభివందనం!

కేపీ ఓలీని ఓడించిన ర్యాపర్ ‘బాలెన్ షా’

కేపీ ఓలీని ఓడించిన ర్యాపర్ ‘బాలెన్ షా’

రూ.50 టికెట్‌కు రూ.30 లక్షలు కానీ విజేత ఎక్కడ?

రూ.50 టికెట్‌కు రూ.30 లక్షలు కానీ విజేత ఎక్కడ?

నిరుద్యోగులకు నెలకు ₹1500, మమతా బెనర్జీ ప్రకటన

నిరుద్యోగులకు నెలకు ₹1500, మమతా బెనర్జీ ప్రకటన

ఖాండ్వా జిల్లాలో వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం

ఖాండ్వా జిల్లాలో వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం

క్యాన్సర్‌ను జయించి UPSCలో ర్యాంక్, సంజయ్ సక్సెస్ స్టోరీ

క్యాన్సర్‌ను జయించి UPSCలో ర్యాంక్, సంజయ్ సక్సెస్ స్టోరీ

మమతా సర్కార్‌పై ప్రధాని మోదీ ఆగ్రహం

మమతా సర్కార్‌పై ప్రధాని మోదీ ఆగ్రహం

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు, భారత్ vs న్యూజిలాండ్

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు, భారత్ vs న్యూజిలాండ్

సడెన్‌గా పెరిగిన బంగారం ధర, హైదరాబాద్‌లో తులం ఎంత?

సడెన్‌గా పెరిగిన బంగారం ధర, హైదరాబాద్‌లో తులం ఎంత?

పరీక్ష హాల్‌లో మొదలైన గొడవ.. ప్రాణం తీసిన కక్ష

పరీక్ష హాల్‌లో మొదలైన గొడవ.. ప్రాణం తీసిన కక్ష

📢 For Advertisement Booking: 98481 12870