Ex minister of Delhi who was released from jail. Kejriwal touched and invited

జైలు నుంచి విడుదలైన ఢిల్లీ మాజీ మంత్రి.. హత్తుకుని ఆహ్వానించిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయన 18 నెలల సుదీర్ఘ కారాగారవాసాన్ని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఉటంకిస్తూ, ఇంకా విచారణే ప్రారంభం కాలేదని పేర్కొంటూ జైన్‌కు బెయిలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఆప్ నేత మనీశ్ సిసోడియా కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించింది. సత్వర విచారణ హక్కును ప్రాథమిక హక్కుగా పేర్కొంది.

మనీలాండరింగ్ కేసులో సత్యేంద్రజైన్‌ను ఈడీ 2022 మే 30న అరెస్ట్ చేసింది. కోర్టు తీర్పును వెల్లడిస్తూ మనీలాండరింగ్ వంటి కఠిన చట్టాల విషయంలో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని ఎత్తి చూపింది. కాగా, ఈ కేసును విచారిస్తునన ఈడీ జైన్ బెయిలు దరఖాస్తును తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే, కేసు విచారణ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశం లేదని, త్వరలోనే కేసును ముగించాలని ఆదేశించింది.

శనివారం తీహార్ జైలు నుంచి విడుదలైన సత్యేంద్రజైన్‌ను కేజ్రీవాల్ ఆహ్వానించారు. ‘వెల్కం బ్యాక్ సత్యేంద్ర’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. జైన్‌ను ఆలింగనం చేసుకున్న రెండు ఫొటోలను షేర్ చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం సత్యేంద్రజైన్ మాట్లాడుతూ.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్రశ్నిస్తున్న వారిపై అణచివేతకు దిగుతోందని ఆరోపించారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Related Posts
సీఎం ప్రోద్భలంతోనే దాడులు : ఎమ్మెల్సీ కవిత
Attacks at the instigation of CM Revanth Reddy: MLC Kavitha

హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై NSUI, కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత ఖండించారు. కాంగ్రెస్ Read more

నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
ML C election counting

రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగనుంది. గత నెల 27న నిర్వహించిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను ఇవాళ అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్ర ఎన్నికల Read more

వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం
cyclone

ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్. Read more

సౌదీ అరేబియాలో చిక్కుకున్న శ్రీకాకుళం యువకులు..
Srikakulam youth trapped in Saudi Arabia

సౌదీ అరేబియాలో ఉపాధి కోసం వెళ్లిన శ్రీకాకుళం జిల్లా యువకుల అవస్థలు.. శ్రీకాకుళం : సౌదీలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి మండలాలకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *