జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధం

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధం

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. “జయకేతనం” పేరుతో నిర్వహించే ఈ సభ శుక్రవారం పిఠాపురం మండలం, చిత్రాడ గ్రామంలోని ఎస్‌బి వెంచర్ వద్ద జరగనుంది.సభ ప్రాంగణం భవ్యంగా అలంకరించబడింది. వేదిక ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే, ఇతరత్రా ఏర్పాట్లు కూడా వేగంగా సాగుతున్నాయి. సభకు వచ్చే అభిమానులు, కార్యకర్తల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని, పెద్ద ఎత్తున పార్కింగ్ స్థలాలను అందుబాటులోకి తెచ్చారు.ఎండ తీవ్రత దృష్ట్యా మంచినీరు, మజ్జిగ, ఇతర తాగునీటి వసతులను ఏర్పాటు చేశారు. అలాగే, భోజన సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచారు.

Advertisements
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధం
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధం

సభలో పాల్గొనే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు, అత్యవసర సేవల కోసం 14 అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు.భద్రతా పరంగా 1600 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 75 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచుతున్నారు.

అదనంగా రోడ్డుకు ఇరువైపులా మరియు సభ ప్రాంగణంలో భారీ ఎల్‌ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి సభను ప్రత్యక్ష ప్రసారం చేసే ఏర్పాట్లు చేశారు.సాయంత్రం జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకొని ప్రసంగించనున్నారు.భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు,అభిమానులు సభకు హాజరయ్యే అవకాశముంది.సభను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కాకినాడ-కత్తిపూడి మధ్య గల 216వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. సభకు హాజరయ్యే వారికి ఎక్కడికక్కడ మంచినీరు, మజ్జిగ వంటివి అందించేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేశారు.సర్వం సిద్ధంగా ఉండటంతో జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.ఈ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు? రాష్ట్ర రాజకీయాలపై ఆయన ఏమి అభిప్రాయపడతారు? అనే ఆసక్తి అధికంగా ఉంది.

అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై పవన్ స్పందించనున్నారా? ఎన్నికల వ్యూహంపై సంకేతాలు ఇస్తారా? అన్నది జనసేన అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది. పవన్ ప్రసంగం రాజకీయ దిశను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. జనసైనికులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సభలో పవన్ కళ్యాణ్ ఏమి ప్రకటిస్తారో చూడాలి!

Related Posts
డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఊరట..2020 నాటి ఎన్నికల కేసు కొట్టివేత
Relief for Donald Trump.Dismissal of 2020 election case

న్యూయార్క్‌: డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఊరట లభించింది. ఆయనపై ఉన్న రెండు క్రిమినల్‌ కేసులను కోర్టు కొట్టివేసింది. రహస్యపత్రాలను తన దగ్గరే ఉంచుకున్న కేసుతోపాటు 2020ఎన్నికల్లో ఓటమిని తిప్పికొట్టే Read more

రేషన్ బియ్యం వ్యాపారులను వదిలిపెట్టం: సీఎం చంద్రబాబు
Future There Will Be Only One Thing That Is Tourism. CM Chandrababu

రేషన్ బియ్యాన్ని కొని విదేశాలకు అమ్ముతున్నారని సీఎం చంద్రబాబూ అన్నారు. ఆలా చేసే వారిని వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో ఎక్కడ Read more

Ilaiyaraaja- Modi : మోదీతో ‘మ్యూజిక్ మ్యాస్ట్రో’ భేటీ
Ilaiyaraaja Modi

ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం గురించి ఇళయరాజా తన ట్విట్టర్ ఖాతాలో Read more

హైదరాబాద్ వాసుల మృతి
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – ఏడుగురు తెలుగువారు దుర్మరణం

తెలుగు యాత్రికులు ప్రయాగరాజ్ లో కుంభమేళా కు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రయాణిస్తున్న మినీ బస్సు ను లారీ ఢీకొట్టింది. మధ్యప్రదేశ్ లో Read more

×