Every Saturday will now be 'No Bag Day' in AP

AP schools : ఏపీలో ఇకపై ప్రతి శనివారం ‘నో బ్యాగ్‌ డే’

AP schools : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుస్తకాల మోతకు స్వస్తి పలికేలా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థులకు బ్యాగుల మోత తప్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ‘నో బ్యాగ్‌ డే’ అమలు చేస్తోంది. ప్రస్తుతం ప్రతి నెలా మూడో శనివారం మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్ డే అమలు చేస్తున్నారు. అయితే ఇకపై ప్రతీ శనివారం కూడా నో బ్యాగ్ డే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసం లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామన్న నారా లోకేష్.. ఇప్పటివరకు మూడో శనివారం మాత్రమే ఉన్న నో బ్యాగ్ డేని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం అమలుచేస్తామని ప్రకటించారు. నో బ్యాగే డే అయిన శనివారం రోజున విద్యార్థులకు క్విజ్‌లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహిస్తామని ట్వీట్ చేశారు.

Advertisements
ఏపీలో ఇకపై ప్రతి శనివారం

విద్యాశక్తి కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు

మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం విద్యా శక్తి పేరుతో ఓ కార్యక్రమం అమలుచేస్తోంది. విద్యాశక్తి కింద ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులకు అదనంగా ఆన్‌లైన్‌లో బోధన అందిస్తోంది. ఐఐటీ మద్రాస్‌ సహకారంతో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ చేపడుతోంది. తొలి విడతలో గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో విద్యాశక్తి కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీ సమయం ముగిసిన తర్వాత సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో జూమ్ ద్వారా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు.

Related Posts
K Ponmudy: తమిళనాడు మంత్రిపై ఖుష్బూ, కనిమొళి ఆగ్రహం
K Ponmudy: తమిళనాడు మంత్రిపై ఖుష్బూ, కనిమొళి ఆగ్రహం

మంత్రి కె. పొన్ముడి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా స్పందన – మహిళలను కించపరిచే ప్రయత్నమేనా? తమిళనాడు రాజకీయాల్లో మరోసారి భారీ దుమారం రేగింది. కారణం – డీఎంకే సీనియర్ Read more

నేడు లిక్కర్ పాలసీ కేసు విచారణ.. హాజరుకానున్న కవిత
Liquor policy case hearing today. Kavitha to attend

హైదరాబాద్‌: ఢిల్లీ మద్యం పాలసీ కేసు విచారణ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట వర్చువల్‌గా ఈరోజు హాజరుకాబోతున్నారు. సీబీఐ Read more

నాలుగో విడుత రుణమాఫీని విడుదల చేసిన సీఎం రేవంత్
runamafi 4th fhace

మాఫీ కాని రైతుల కోసం నాలుగో విడుత రుణమాఫీ రూ.2747.67 కోట్లు నిధుల‌ను విడుదల చేశారు సీఎం రేవంత్. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి Read more

ఆర్జీకర్‌ ఆసుపత్రిలో వైద్యురాలి విగ్రహం.. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
statue of a doctor in Rg Kar hospital. There are different opinions on social media

statue of a doctor in Rg Kar hospital.. There are different opinions on social media కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×