Government should support Telangana farmers.. Etela Rajender

ఐఏఎస్లు బానిసల్లా పనిచేయొద్దు – ఈటల

  • ప్రభుత్వాలు ఐదేళ్లపాటు మాత్రమే , ఐఏఎస్ అధికారులు 35 ఏళ్ల పాటు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల తీరుపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ, ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకుల బానిసల్లా వ్యవహరించొద్దని హెచ్చరించారు. ప్రభుత్వాలు ఐదేళ్లపాటు మాత్రమే ఉంటాయి, కానీ ఐఏఎస్ అధికారులు 35 ఏళ్ల పాటు పరిపాలనలో ఉంటారని, కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు.

Advertisements
Etela hydra

ఈటల తన ప్రసంగంలో, గతంలో ప్రభుత్వ పెద్దల అనుకూలంగా పని చేసిన కొన్ని అధికారులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. రాజకీయ నాయకుల మాటలకే లోబడిపోయి అధికార దుర్వినియోగానికి పాల్పడితే, వారి భవిష్యత్తుపై దుష్ప్రభావం పడుతుందని హెచ్చరించారు. అధికార యంత్రాంగం న్యాయబద్ధంగా పని చేయాలని, కేవలం అధికార పార్టీల ఆదేశాలకు లోబడకూడదని సూచించారు.

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారికి కఠిన చర్యలు తప్పవని ఈటల స్పష్టం చేశారు. తాము కాషాయ బుక్ మెంట్ైన్ చేస్తున్నామని, ఎవరైనా అధికార దుర్వినియోగానికి పాల్పడితే, భవిష్యత్తులో కచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజా సేవకులుగా వ్యవహరించాల్సిన అధికారులు, పాలక వర్గాలకు కొమ్ముకాస్తే జైలు పాలవ్వాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.

Related Posts
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Fatal road accident. Six killed

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దీంతో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. అలాగే మరో వ్యక్తికి Read more

లైసెన్స్‌లు రద్దు చేస్తాం: పొన్నం ప్రభాకర్ వార్నింగ్
Ponnam Prabhakar

రోడ్డు నిబంధనలు ఉల్లగించిన వారి లైసెన్స్‌లు రద్దు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన Read more

WhatsApp : తప్పుడు ఖాతాల గుర్తింపు : లక్షలాది అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్
WhatsApp తప్పుడు ఖాతాల గుర్తింపు లక్షలాది అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్

WhatsApp : తప్పుడు ఖాతాల గుర్తింపు : లక్షలాది అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి Read more

ప్రతి మహిళకు రూ.35000 ఇవ్వాలి – ఎమ్మెల్సీ కవిత డిమాండ్
kavitha demand

ప్రజాక్షేత్రంలో పోరాటానికి దిగుతామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ప్రతి మహిళకు Read more

×