Earthquake in Nepal .. 6.1 intensity on the Richter scale!

నేపాల్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా న‌మోదు!

ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు

కాఠ్‌మాండూ: హిమాలయ దేశమైన నేపాల్‌లో భూకంపం సంభవించింది. సింధుపల్‌చోక్‌ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భూమి కంపించిందని సమాచారం. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వివరాలను చూస్తే, నేపాల్‌లోని సింధుపల్‌చోక్ జిల్లాలో భైరవకుండ వద్ద భూప్రకంపనలు సంభవించాయి. అక్కడే భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. రిక్టర్‌ స్కేల్‌పై 6.1 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు వెల్లడించారు. అయితే, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

Advertisements

నేపాల్‌ భూకంపం ప్రభావం భారతదేశంలో..

ఇంకా, ఈ భూకంప ప్రభావం భారత్‌, చైనా, టిబెట్‌ సరిహద్దుల్లో స్వల్పంగా కనిపించిందని అధికారులు తెలియజేశారు.నేపాల్‌ భూకంపం ప్రభావం భారతదేశంలోని ఉత్తర రాష్ట్రాలపై కూడా పడింది. ముఖ్యంగా బీహార్‌ రాజధాని పాట్నా, పశ్చిమబెంగాల్‌, సిక్కింలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. దీని కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్‌లో కూడా భూకంపం సంభవించింది. అక్కడ రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రత నమోదు అయింది. ఈరోజు 05.14 ISTకి పాకిస్తాన్‌ను తాకింది.

Related Posts
రేవంత్‌ గాలి మాటలకు జవాబు చెప్పాలా? : కిషన్ రెడ్డి
Kishan Reddy comments on cm revanth reddy

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గాలి మాటలకు సమాధానం చెప్పాలా Read more

ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ (IITF)..
india international trade fair

ప్రతీ సంవత్సరం, ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ (IITF) ఒక విశాలమైన వాణిజ్య మరియు సాంస్కృతిక ప్రదర్శనగా ప్రగ్యతి మైదాన్, ఢిల్లీ లో నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం, Read more

Telangana: తెలంగాణలో మొదలైన ధాన్యం కేంద్రాలు
తెలంగాణలో ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు

తెలంగాణలోని రైతుల కోసం రబీ సీజన్‌లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. వరి కోతలు ప్రారంభం అవ్వడంతో, మార్కెట్‌లో ధరలు Read more

మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామో తెలుసా?
మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామో తెలుసా?

ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజు మహిళల హక్కులను గుర్తించి,పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో Read more

Advertisements
×