Earthquake in Afghanistan...magnitude 4.7 on the Richter scale recorded

Earthquake : అఫ్గనిస్తాన్ లో భూకంపం…రిక్టర్‌ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదు

Earthquake : ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. మయన్మార్, బ్యాంకాక్ లో భారీ భూకంపం రాగా.. ఇండియా,చైనా,వియత్నా,బంగ్లాదేశ్‌లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ అఫ్గనిస్తాన్ లో భూకంపం వచ్చింది. ఉదయం 5.16 గంటలకు 180 కి.మీ లోతులో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ తెలిపింది. రిక్టర్ స్కూల్ పై 4.7 గా నమోదయ్యిందని వెల్లడించింది. జనం ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ఎటువంటిఆస్తి నష్టం కానీ ప్రాణనష్టం జరిగలేదు.

Advertisements
అఫ్గనిస్తాన్ లో భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై

మార్చి 13న కూడా ఆఫ్ఘనిస్థాన్‌లో భూమి కంపించింది

భూకంపశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 4.3, 4.7 తీవ్రతతో వచ్చే భూకంపాలను మోడరేట్ భూకంపాలుగా వర్గీకరిస్తారు. ఇటువంటివి బలహీనమైన నిర్మాణాలు ఉన్న ప్రదేశాలలో భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కాగా, మార్చి 21న ఆఫ్ఘనిస్థాన్‌లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) నివేదిక ప్రకారం దీని కేంద్రం భూమికి 160 కి.మీ. దిగువన ఉంది. మార్చి 13న కూడా ఆఫ్ఘనిస్థాన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4 తీవ్రత నమోదయ్యింది.

150 మందికి పైగా మరణించారు

కాగా, నిన్న మయన్మార్ , బ్యాంకాక్ లో నిమిషాల వ్యవధిలోనే ఆరు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 150 మందికి పైగా మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 700 మందికి పైగా గాయపడ్డారు. వందలాది బిల్డింగ్ లు కుప్పకూలాయి. ఎక్కడిక్కడ రోడ్లు,బ్రిడ్జీలు దెబ్బతిన్నాయి. మయన్మార్‌లో తీవ్ర భూకంపం సంభవించిన దరిమిలా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. శిథిలా కింద చిక్కుకున్న వాళ్లను కాపాండేందుకు రెస్క్యూ టీం సహాయం కొనసాగుతుంది.

Related Posts
AP Assembly : అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫొటో సెషన్‌
Photo session for MLAs and MLCs at AP Assembly premises

AP Assembly : ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఈరోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫొటో సెషన్‌ నిర్వహించారు. మొదటి వరుసలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, స్పీకర్‌ Read more

sunita williams: భూమ్మీదకు రానున్న సునీత, విల్మోర్-సురక్షితంగా ఎలా ల్యాండ్ అవుతుంది?
భూమ్మీదకు రానున్న సునీత, విల్మోర్- ఓసారి చరిత్రలోకి తొంగిచూద్దాం

ఎనిమిది రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 9 నెలలుగా చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమిని చేరనున్నారు. అమెరికా కాలమానం Read more

China: చైనా కీలక సైనిక జనరల్‌ అరెస్ట్‌..?
Key Chinese military general arrested..?

China: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితమైన ఫుజియాన్‌ నాయకులు, జనరల్స్‌పై చర్యలు మొదలయ్యాయి. అత్యంత కీలకమైన సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ హి వైడాంగ్‌ Read more

క్రికెట్లో భారత మహిళ అరుదైన రికార్డు!
క్రికెట్లో భారత మహిళ అరుదైన రికార్డు!

కేవలం 95 ఇన్నింగ్స్‌లలో 4000 పరుగుల మైలురాయిని చేరుకున్న స్మృతి మంధాన, వన్డేల్లో అత్యంత వేగంగా 4000 పరుగులు సాధించిన భారత మహిళగా నిలిచింది. మిథాలీ రాజ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×