South Central Railway has announced 26 special trains for Sankranti

దసరా పండుగ..తెలుగు రాష్ట్రాలకు 644 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే

trains

హైదరాబాద్‌: దసరా పండుగ సెలవులతో నగరంలోని ప్రధాన స్టేషన్లలో భారీగా రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపునకు వెళ్లే రైళ్లలో నిలబడి వెళ్లేందుకూ చోటు ఉండని పరిస్థితి ఏర్పడింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ అలర్ట్ అయ్యింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్దమైంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్ నగర్, తిరుపతి రైల్వే స్టేషన్ల నుంచి ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Advertisements

దక్షిణ మధ్య రైల్వే నుంచి 170 రైళ్లు, ఇతర ప్రాంతాల నుంచి దక్షిణ మధ్య రైల్వే మీదుగా 115 రైళ్లు నడపనున్నారు. మరో 185 రైళ్లు అందుబాటులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రూట్లను కూడా ప్రకటించారు. సికింద్రాబాద్-కాకినాడ, సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-నగర్ సోల్, సికింద్రాబాద్-మడ్లాటౌన్, సికింద్రాబాద్-సుబేదార్ గంజ్, హైదరాబాద్-గోరఖ్‌పూర్, మహబూబ్‌నగర్-గోరఖ్‌పూర్, సికింద్రాబాద్-దానాపూర్, సికింద్రాబాద్-రాక్సల్, సికింద్రాబాద్, సికింద్రాబాద్ , సికింద్రాబాద్ – విశాఖపట్నం ఉన్నాయి. సికింద్రాబాద్-సంత్రాగచ్చి, తిరుపతి-మచిలీపట్నం, తిరుపతి-అకోలా, తిరుపతి-పూర్ణ, తిరుపతి-హిసార్, నాందేడ్-ఈరోడ్, జాల్నా-చాప్రా, తిరుపతి-షిర్డీ తదితర ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

Related Posts
Telangana : 400 ఎకరాల భూమిపై హైకోర్టు కీలక ఆదేశాలు
Telangana 400 ఎకరాల భూమిపై హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. వట ఫౌండేషన్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయు) విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన Read more

SLBC టన్నెల్ లోకి రోబోలు
మృతదేహాల కోసం రోబోలు రంగంలోకి – హైదరాబాద్ అన్వీ రోబోటిక్ టీమ్ ప్రత్యేక ప్రదర్శన

టన్నెల్ లో చోటుచేసుకున్నప్రమాదం సందర్భంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించడం ప్రస్తుతం అత్యవసరం అవుతోంది. ఎస్‌ఎల్‌బీసీ (సుజలాం సుఫలాం బహుద్దేశీయ కాలువ) టన్నెల్‌లో కూలిన శకలాల వల్ల చిక్కుకుపోయిన Read more

Ramzan: ఆంధ్రాలో ఇఫ్తార్ విందుల్ని బహిష్కరించిన ముస్లింలు.. ఎందుకంటే?
Ramzan: ఆంధ్రాలో ఇఫ్తార్ విందుల్ని బహిష్కరించిన ముస్లింలు.. ఎందుకంటే?

పార్లమెంట్‌లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఇప్పటికే రంజాన్ మాసంలో ముస్లింలకు ఇచ్చే ఇఫ్తార్ విందులను బహిష్కరించాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. బీహార్, ఆంధ్రప్రదేశ్ Read more

గ్రామ పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు
revanth reddy

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది రేవంత్ సర్కార్. ఇకపై ఈ ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో నెల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి Read more

Advertisements
×