हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

కలెక్టర్ మీటింగ్ లో రమ్మీ ఆడిన DRO.. ఏంటి సర్ ఇది..?

Sudheer
కలెక్టర్ మీటింగ్ లో రమ్మీ ఆడిన DRO.. ఏంటి సర్ ఇది..?

అనంతపురం కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్‌లో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోలా వ్యవహారం కలకలం రేపింది. ఎస్సీ వర్గీకరణ సమస్యలపై ఏకసభ్య కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులు ప్రజల వినతిపత్రాలను స్వీకరించడంలో తలమునకలై ఉండగా, డీఆర్వో మాత్రం తనకు ఏసంబంధం లేదన్నట్లు తన మొబైల్ ఫోన్‌లో ఆన్లైన్ రమ్మీ ఆడుతూ ఉన్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఓ పక్క మీటింగ్ జరుగుతుండగా డీఆర్వో తన మొబైల్ ఫోన్‌లో రమ్మీ ఆడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ఓ ఉన్నతాధికారి ఇలాంటి వ్యవహారం చేయడం పట్ల నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సమావేశానికి వచ్చిన వారు కూడా ఈ ప్రవర్తనను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ బాధ్యతలు నిర్లక్ష్యంగా వదిలేసి ఇలా ప్రవర్తించడం ప్రజాస్వామ్యంలో మంచికాదని పలువురు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్ వంటి ముఖ్యమైన కార్యాలయంలో జరిగే సమావేశాల్లో కూడా ఇలాంటి వ్యవహారాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశమని రాజకీయ, సామాజిక వర్గాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

ఈ ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ పన్నుల డబ్బుతో పనిచేస్తున్న నేపథ్యంలో వారు ప్రజలకు సేవ చేయడంలో శ్రద్ధ వహించాలని, ఇటువంటి నిర్లక్ష్యపు చర్యలకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఇంకా అధికారిక స్పందన రాలేదు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870