हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

బెంగళూరు లో మొదలైన త్రాగునీటి కొరత,కార్లు కడిగితే జరిమానా

Anusha
బెంగళూరు లో మొదలైన త్రాగునీటి కొరత,కార్లు కడిగితే జరిమానా

వేసవి తాపానికి నీటి కొరత భయంతో  బెంగళూరు వాటర్ బోర్డ్ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. గతేడాది తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న అనుభవంతో ఈసారి అధిక ఉష్ణోగ్రతలకు ముందు నుంచే పటిష్ఠ ప్రణాళికను రూపొందించింది. ముఖ్యంగా త్రాగునీటి వృథాను అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంది.బెంగళూరు నగరంలో తాగునీటి వినియోగంపై మున్సిపల్ బోర్డ్ పక్కా పర్యవేక్షణ అమలు చేయనుంది. త్రాగునీటిని వాహనాలు కడగడానికి, తోటల పెంపకానికి, నిర్మాణ పనులకు, ఫౌంటెయిన్‌లకు ఉపయోగించినట్టు గుర్తిస్తే రూ. 5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఒకసారి జరిమానా చెల్లించిన తర్వాత కూడా మళ్లీ అదే తప్పు చేస్తే అదనంగా మరో రూ. 5,000 మరియు రోజుకు రూ. 500 చొప్పున ఫైన్ విధిస్తామని స్పష్టం చేసింది.ఈ చర్యలు వాటర్ బోర్డ్ యాక్ట్‌లోని సెక్షన్ 109 ప్రకారం అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నగరవాసులకు, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, సినిమా థియేటర్ల నిర్వాహకులకు నీటి వృథా చేయరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా త్రాగునీటిని వృథా చేస్తుంటే తమ కాల్ సెంటర్ నెంబర్ 1916కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.గతేడాది వేసవిలో బెంగళూరులో సుమారు 14,000 బోరుబావులు ఎండిపోయిన విషయం తెలిసిందే. ఈసారి మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల భూగర్భ జలాలు మరింత వేగంగా అడుగంటే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సి) శాస్త్రవేత్తలు కూడా భవిష్యత్తులో బెంగళూరులో త్రాగునీటి కొరత మరింత తీవ్రంగా ఉండొచ్చని తెలిపారు.

p4b8lmr8 bengaluru water crisis 625x300 13 March 24

అధికారులు త్రాగునీటి పొదుపు కోసం ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. అనవసరంగా నీరు వృథా కాకుండా చూడాలని, కార్లు, బైకులు కడగడంవంటివి చేయకూడదని తెలిపారు. ఇంటి పైకప్పుల నుంచి వర్షపు నీటిని సేకరించేందుకు రేన్‌వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అమలు చేయాలని సూచించారు.వాటర్ బోర్డ్ తీసుకున్న ఈ చర్యలు ప్రజలకు కొంత అసౌకర్యంగా అనిపించినా, భవిష్యత్తులో నీటి కోసం ఎదుర్కోవాల్సిన కష్టాలను దృష్టిలో పెట్టుకుంటే ఇది ఎంతో అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేసవి వేడిలో ఒక్కొక్క నీటి బొట్టు అమూల్యమని గుర్తించి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీటిని వాడాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.అందువల్ల, ఈ వేసవిలో నీటి పొదుపు అవసరాన్ని గమనించి, ప్రతి ఇంట్లో నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా అందరూ సహకరించాలని వాటర్ బోర్డ్ కోరుతోంది. అప్పుడే నగరంలో తాగునీటి కొరత సమస్యకు కొంతమేర ఉపశమనంగా మారనుంది.

త్రాగునీటివృథాపై సమాచారం అందించాలని నగరవాసులకు విజ్ఞప్తి

త్రాగునీటిని వృథా చేస్తూ ఎవరైనా కనిపిస్తే, కాల్ సెంటర్ నెంబర్ 1916 కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించింది. నీటి వృథాపై కఠిన చర్యలు తీసుకుంటామని ,బెంగళూరు వాటర్ బోర్డ్ ప్రజలను కోరింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870