Double roads from every village to the mandal.. Komati Reddy

Komatireddy venkat reddy: ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్‌ రోడ్లు : కోమటిరెడ్డి

Komatireddy venkat reddy : అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్మాలని నిర్ణయించడంపై ప్రతిపక్షాలు సభలో నిలదీశాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. కమీషన్లకు కక్కుర్తి పడి ORRను రూ.7,300 కోట్లకు అమ్ముకున్నారు. లక్ష కోట్ల విలువ చేసే రోడ్డును రూ.7,300 కోట్లకు అమ్ముకున్న వీళ్లు కూడా భూముల అమ్మకాల గురించి మాట్లాడుతున్నారు. హరీష్ రావుకు ఏం తెలియదు. ఆయన్ను ముందు పెట్టి వెనుక ఇద్దరు ఉండి నడిపిస్తున్నారు అని బీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

ప్రతి గ్రామం నుంచి మండలానికి

రాష్ట్రమంతా తిరిగి చూద్దామా

కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. వారికి ఆరు నెలలు లేదా మూడు నెలలకు చెల్లిస్తామన్నారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్‌ రోడ్లు వేయిస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే రోడ్లు వేశారని చెప్పారు. ఆ మూడు చోట్ల రోడ్లకు చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని పేర్కొన్నారు. ఛాలెంజ్‌ చేస్తున్నా.. రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని హరీశ్‌రావుకు సవాల్‌ విసిరారు. కోమటిరెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఆర్‌అండ్‌బీ పనుల గురించి లెక్కలు తీద్దామన్నారు. రోడ్ల గురించి ఒకరోజు ప్రత్యేకంగా చర్చిద్దామని చెప్పారు.

Related Posts
Atchannaidu : ప్రతి రైతునూ ఆదుకుంటాం – మంత్రి అచ్చెన్న
minister atchannaidu

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన వడగండ్ల వానల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టాన్ని పరిగణలోకి తీసుకుని, ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు Read more

పరిశుభ్రత కోసం ప్రపంచ టాయిలెట్ దినోత్సవం..
world toilet day

ప్రపంచ టాయిలెట్ దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 19న జరుపుకుంటారు. ఈ దినోత్సవం ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సానిటేషన్ సమస్యలను పరిష్కరించడం మరియు ప్రజలకు పరిశుభ్రత మరియు Read more

Siddharth Luthra: 45 రోజులు, 4 కేసులు – సిద్ధార్థ్ లూథ్రాకు రూ.2.86 కోట్లు – వైసీపీ
Sidharth Luthra

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ మిత్రుడైన సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ Read more

జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్..కొన్న 40 రోజులకే
electric bike explodes in j

తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు ఇస్తూ ప్రోత్సహిస్తుంటే..మరోపక్క ఎలక్ట్రిక్ బైక్లు పేలుతున్న ఘటనలు వాహనదారులకు షాక్ కలిగిస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో కొన్న 40 రోజులకే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *