ముగిసిన అడ్మిషన్ల ప్రక్రియ 64 కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కాలేదు
– 9, 10 తేదీల్లో ఇంట్రాకాలేజెస్ ఆప్షన్లు
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో (degree colleges) మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (Dost) 2025 అడ్మిషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 957 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 4,36,947 సీట్లు అందుబాటులో ఉండగా వాటిలో 1,43,037 మంది చేరారు. 63 ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ఒక్క ఆడ్మిషన్ కూడా కాలేదు. శాతవాహన యూనివర్సిటీలో ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కూడా ఒక్క అడ్మిషన్ కూడా జరగలేదు. డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం మూడు విడతల్లో సీట్లను కేటాయించారు. రెండు, మూడో విడతల్లో సీటు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరడానికి ఇచ్చిన గడువు కాస్త శనివారం(జులై 5)తో ముగిసింది.

ముగిసిన డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ
దీంతో 2025-26 సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన ట్టయింది. మొదటి విడతలో 65వేల మందికి సీట్ల కేటాయింపు చేపట్టగా వారిలో సుమారు 43 వేల మంది కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ (Self-reporting in colleges) ఇచ్చారు. ఇక రెండో విడతలో 43వేల సీట్ల కేటాయింపు చేయగా.. మూడో విడతలో 85,680 మంది విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేశారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 30 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా దానిని కాస్త జులై 5 వరకు పొడిగించారు. అదికాస్త శనివారంతో ముగిసింది. దోస్త్ (Dost) మూడో విడత సీట్ల కేటాయింపును జూన్ 28న విడుదల చేశారు. దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్లో భాగంగా 82,770 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మూడో విడతలో 96,015 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారిలో 85,680 మందికి సీట్ల కేటాయింపు చేపట్టారు. తక్కువ ఆప్షన్లు ఇచ్చిన కారణంగా 10,335 మందికి మొదటి విడతలో సీట్ల కేటాయింపు చేయలేదు. రెండు, మూడో విడతలో సీటు పొందిన వారు రూ.500 రూ. 1000 ఫీజు చెల్లించి ఆయా కాలేజీల్లో చేరడానికి శనివారం (జులై 5) వరకు అవకాశం కల్పించగా గడువు కాస్త ముగిసింది. ఉస్మా నియా వర్సిటీలో 1,95,397 సీట్లు ఉండగా.. 67,157 మంది చేరారు. కాకతీయ యూనివర్సిటీలో 1,07,080 సీట్లు ఉండగా 33,289 మంది చేరారు. శాతవాహన యూనివర్సిటీలో 38,220 సీట్లు ఉండగా.. 14,022 మంది చేరారు.
పాలమూరు యూనివర్సిటీలో 34,220 సీట్లు ఉంటే వాటిలో 10,638 మంది చేరారు. తెలంగాణ యూనివర్సిటీ 33,110 సీట్లు అందుబాటులో ఉంటే 9959 మంది చేరారు. మహాత్మాగాంధీ
యూనివర్సిటీలో 26,660 సీట్లు ఉండగా వాటిలో 6589 మంది చేరారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ లో 1850 సీట్లు ఉండగా అందులో 1255 మంది చేరారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Minor Girl Rape Case : మైనర్పై అత్యాచారం: యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష