ఏ రాష్ట్రానికి నష్టం కలిగించొద్దు - డీలిమిటేషన్​పై మోదీని కోరిన జగన్​

YS Jagan: ఏ రాష్ట్రానికి నష్టం కలిగించొద్దు – డీలిమిటేషన్​పై మోదీని కోరిన జగన్​

డీలిమిటేషన్ ప్రక్రియ అంశంపై ప్రధాని మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రెండు పేజీల లేఖ రాశారు. లోక్​సభ, రాజ్యసభలో ప్రాతినిథ్యం కోల్పోకుండా ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా డీలిమిటేషన్ ప్రక్రియ నిర్వహించాలని ఆయన కోరారు. జనాభా ప్రాతిపదికన లోక్​సభ, రాజ్యసభల్లో ఆయా రాష్ట్రాలకు సీట్లు తగ్గే పరిస్థితి రాకుండా చూడాలని పేర్కొన్నారు. 2026 జనగణన ప్రక్రియ ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ ప్రక్రియతో నష్టం కలుగుతుందన్న భావన దక్షిణాది రాష్ట్రాల్లో ఉందని అందులో స్పష్టం చేశారు.

Advertisements
ఏ రాష్ట్రానికి నష్టం కలిగించొద్దు - డీలిమిటేషన్​పై మోదీని కోరిన జగన్​

ఆందోళన కలిగిస్తోంది : జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన చేసే నియోజకవర్గాల పునర్విభజన ఆందోళన కలిగిస్తోందని వెల్లడించారు. జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా 1971 నాటికి దిగజారిందని వచ్చే 15 ఏళ్లలో ఇది మరింత కనిష్ఠానికి చేరుతుందని జగన్ స్పష్టం చేశారు.
జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాదికి నష్టం
డీలిమిటేషన్​పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. అది ప్రజల హక్కుల కోసం చేసే పోరాటమని అన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియపై ఎక్స్​లో పోస్ట్​ చేసిన షర్మిల జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదికి జరిగేది తీరని నష్టమేనని పేర్కొన్నారు. ఉత్తరాది ప్రాబల్యం మరింతగా పెరిగి దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతతో పని లేకుండా పోతుందన్నారు. ‘సొమ్ము సౌత్ ది – సోకు నార్త్ ది’ అనే పరిస్థితి ఎదురువుతుందని ఆక్షేపించారు.

పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేదు

డీలిమిటేషన్ పేరుతో లిమిటేషన్ ఫర్ సౌత్‌లా చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత విధానంతో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 143 సీట్లు పెరుగుతాయని అన్నారు. దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెరిగే సీట్లు కేవలం 49+41+54 = 144 సీట్లు మాత్రమేనని అన్నారు.

Related Posts
పుష్ప 2: అదనపు 20 నిమిషాల ఫుటేజీతో రీలోడ్
పుష్ప 2: అదనపు 20 నిమిషాల ఫుటేజీతో రీలోడ్

టాలీవుడ్‌లోని అతిపెద్ద బ్లాక్‌బస్టర్ పుష్ప 2: ది రూల్ ఇప్పుడు ప్రేక్షకులకు మరింత ఆసక్తికరమైన అనుభూతిని అందించబోతోంది. ఈ చిత్రానికి మరో 20 నిమిషాల అదనపు ఫుటేజీ Read more

ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
CBN Gvt Schools

పాఠశాలలకు గుడ్ న్యూస్ ! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో Read more

Telangana: కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court notices to the Central and AP government

Telangana: కృష్ణానది ప్రాజెక్టులపై కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కృష్ణా పరీవాహకంలోని ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB)కి అప్పగించాలని Read more

ఆల్ టెర్రయిన్ వెహికిల్స్ తో భద్రత మరింత కట్టుదిట్టం
ఆల్ టెర్రయిన్ వెహికిల్స్ తో భద్రత మరింత కట్టుదిట్టం

సరిహద్దుల్లో పహారా కాచే సైన్యం ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్లాలంటే కాలి నడకను ఎక్కువగా ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రతికూల వాతావరణంలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×