ఏ రాష్ట్రానికి నష్టం కలిగించొద్దు - డీలిమిటేషన్​పై మోదీని కోరిన జగన్​

YS Jagan: ఏ రాష్ట్రానికి నష్టం కలిగించొద్దు – డీలిమిటేషన్​పై మోదీని కోరిన జగన్​

డీలిమిటేషన్ ప్రక్రియ అంశంపై ప్రధాని మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రెండు పేజీల లేఖ రాశారు. లోక్​సభ, రాజ్యసభలో ప్రాతినిథ్యం కోల్పోకుండా ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా డీలిమిటేషన్ ప్రక్రియ నిర్వహించాలని ఆయన కోరారు. జనాభా ప్రాతిపదికన లోక్​సభ, రాజ్యసభల్లో ఆయా రాష్ట్రాలకు సీట్లు తగ్గే పరిస్థితి రాకుండా చూడాలని పేర్కొన్నారు. 2026 జనగణన ప్రక్రియ ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ ప్రక్రియతో నష్టం కలుగుతుందన్న భావన దక్షిణాది రాష్ట్రాల్లో ఉందని అందులో స్పష్టం చేశారు.

ఏ రాష్ట్రానికి నష్టం కలిగించొద్దు - డీలిమిటేషన్​పై మోదీని కోరిన జగన్​

ఆందోళన కలిగిస్తోంది : జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన చేసే నియోజకవర్గాల పునర్విభజన ఆందోళన కలిగిస్తోందని వెల్లడించారు. జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా 1971 నాటికి దిగజారిందని వచ్చే 15 ఏళ్లలో ఇది మరింత కనిష్ఠానికి చేరుతుందని జగన్ స్పష్టం చేశారు.
జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాదికి నష్టం
డీలిమిటేషన్​పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. అది ప్రజల హక్కుల కోసం చేసే పోరాటమని అన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియపై ఎక్స్​లో పోస్ట్​ చేసిన షర్మిల జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదికి జరిగేది తీరని నష్టమేనని పేర్కొన్నారు. ఉత్తరాది ప్రాబల్యం మరింతగా పెరిగి దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతతో పని లేకుండా పోతుందన్నారు. ‘సొమ్ము సౌత్ ది – సోకు నార్త్ ది’ అనే పరిస్థితి ఎదురువుతుందని ఆక్షేపించారు.

పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేదు

డీలిమిటేషన్ పేరుతో లిమిటేషన్ ఫర్ సౌత్‌లా చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత విధానంతో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 143 సీట్లు పెరుగుతాయని అన్నారు. దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెరిగే సీట్లు కేవలం 49+41+54 = 144 సీట్లు మాత్రమేనని అన్నారు.

Related Posts
ప్రభల తీర్థాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హవా
prabhala theertham 2025 paw

కోనసీమ జిల్లాలో నిన్న నిర్వహించిన ప్రభల తీర్థాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హవా కనిపించింది. ఏ గ్రామానికి వెళ్లినా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రత్యేక Read more

ఉద్యోగాలు మానేస్తున్న భారతీయ విద్యార్థులు!
students

గతేడాది సెప్టెంబర్ నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి.. అమెరికాలో ఉండే విదేశీయుల్లో ఆందోళన మొదలైంది. ఎక్కడ తాము బహిష్కరణకు Read more

RevanthReddy :మోదీకి సీఎం రేవంత్ లేఖ ఎందుకో తెలుసా!
RevanthReddy :మోదీకి సీఎం రేవంత్ లేఖ ఎందుకో తెలుసా!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముప్పై మూడోసారి హస్తినకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులకు కేంద్ర Read more

నేడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan is going to campaign for Maharashtra elections today

అమరావతి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు(శనివారం) మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు కూటమి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *