Donor's heart moved within 13 minutes

13 నిమిషాల్లోనే డోనర్ గుండె త‌ర‌లింపు..

హైదరాబాద్‌: నగరంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు ఓ గుండెను సాధ్యమైనంత వేగంగా తరలించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. డాక్టర్లు హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించి అవసరమైన పేషెంట్ కు సకాలంలో ఆపరేషన్ చేశారు. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్డీకపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో శుక్రవారం రాత్రి 9.30 గంటలకు డాక్టర్ల టీమ్ గుండెను తరలించింది. ఇందుకోసం హైదరాబాద్ మెట్రో అధికారులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి పెద్ద మనసు చాటుకున్నారు.

గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్‌లో అది కూడా 13 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 13 నిమిషాల్లో గుండెను తరలించారు. సకాలంలో గ్లోబల్ హాస్పిటల్‌కు గుండె చేరడంతో అవసరమైన పేషెంట్‌కు డాక్టర్లు సర్జరీ చేసి గుండెను అమర్చారు. గతంలోనూ ఇలా గుండె, కిడ్నీ లాంటి ముఖ్యమైన అవయవాలు రోడ్డు మార్గం ద్వారా, మెట్రో రైలు ద్వారా తరలించడంతో ఎందరో ప్రాణాలు నిలిచాయి.

హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ర‌ద్దీ మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. గుండె త‌ర‌లింపులో ఆల‌స్యం కావొద్దు అన్న ఉద్దేశంతో మెట్రో రైలులో దాన్ని పంపింపారు. జ‌న‌వ‌రి 17వ తేదీన రాత్రి 9.30 నిమిషాల స‌మ‌యంలో మెట్రో రైలు ద్వారా డోనార్ గుండెను త‌ర‌లించారు. చాలా సునిశిత‌మైన ప్లానింగ్‌, మెట్రో రైలు.. వైద్యులు, ఆస్ప‌త్రి వ‌ర్గాల సహ‌కారంతో ఆ ప్ర‌య‌త్నం స‌ఫ‌ల‌మైన‌ట్లు తెలుస్తోంది.

Related Posts
శ్రీవారి ఆలయం నుండి పద్మావతి అమ్మవారికి సారె
Saree for Goddess Padmavati

తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె స‌మ‌ర్పించారు. ప్రతి Read more

తెలంగాణకు 39 హైవేలకు నిధులు కేటాయింపు
తెలంగాణకు 39 హైవేలకు నిధులు కేటాయింపు

తెలంగాణ రాష్ట్రం జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారీగా రూ.5,658 కోట్లు కేటాయించింది. ఈ నిధులు తెలంగాణలోని వివిధ జాతీయ Read more

పోలీసు విచారణకు టాలీవుడ్ హీరోయిన్లు?
Heroines Kajal and Tamannaah will be interrogated by the police

క్రిప్టోకరెన్సీ పేరుతో భారీ మోసం.. న్యూఢిల్లీ: పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, కాజల్‌ అగర్వాల్‌లను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు. Read more

Kavitha : పసుపు రైతుల‌కు 15 వేల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వండి: క‌విత
Give turmeric farmers a minimum support price of Rs 15,000: Kavitha

Kavitha: ప‌సుపు రైతుల‌కు రూ.15వేల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని ఎమ్మెల్సీ క‌విత ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ శాస‌న‌మండ‌లి వ‌ద్ద ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్ల‌కార్డుల‌తో Read more