41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ కు ట్రంప్ సిద్ధం

ఈయూకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు..

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు హెచ్చరికలు జారీ చేశారు. ఈయూ తమతో దారుణంగా వ్యవహరించిందని, దానిపై సుంకాలు విధించక తప్పదని పేర్కొన్నారు. అయితే ట్రంప్ హెచ్చరికలపై ఈయూ కూడా తీవ్రంగానే స్పందించింది. ట్రంప్ అన్నంత పనీ చేస్తే తాము కూడా గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతూనే చర్చల ద్వారా వాణిజ్య సంఘర్షణను పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేసింది.

27 దేశాల యూరోపియన్ యూనియన్‌పై సుంకాల విధింపు గురించి ఆలోచిస్తున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. ‘‘ఈయూపై సుంకాలు విధిస్తాం. మీకు నిజమైన సమాధానం కావాలా? లేక రాజకీయ పరమైన సమాధానం కోరుకుంటున్నారా?’’ అని అయన ప్రశ్నించారు. యూరోపియన్ యూనియన్ తమను దారుణంగా ట్రీట్ చేసిందని ఆయన విమర్శించారు. ట్రంప్ తన మొదటి విడత పదవీకాలంలోనూ యూరోపియన్ యూనియన్ స్టీల్, అల్యూమినియం ఎగుమతులపై భారీగా సుంకాలు విధించారు. ఇది ఈయూతో వాణిజ్య యుద్ధానికి దారితీసింది. ప్రతిగా యూరోపియన్ యూనియన్ అమెరికా నుంచి ఎగుమతి అయ్యే విస్కీ, మోటార్ సైకిళ్లు సహా పలు వస్తువులపై సంకాలు విధించి ప్రతీకారం తీర్చుకుంది.

image

కాగా, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆయా దేశాల దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తామంటూ మొదటి నుంచి చెబుతున్న అగ్రరాజ్య అధినేత.. ఆ హెచ్చరికలను నిజం చేశారు. కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధించే దస్త్రంపై శనివారం సంతకం చేశారు. దీంతో ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్‌ వార్‌కు తెరలేచింది. దీనికి ప్రతిస్పందనగా కెనడా ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా నుంచి తమదేశానికి వచ్చే 155 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై తాము 25 శాతం సుంకాలు విధించినట్టు, వాటిని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచంలో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల ప్రభావం మిగిలిన దేశాలకు కూడా వ్యాపిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్‌పై సైతం రేపో మాపో ఆంక్షలు విధించే అవకాశముందని వారు తెలిపారు. అమెరికా చర్యపై చైనా డబ్ల్యూటీవోను ఆశ్రయించినా, ప్రతీకార చర్యలకు దిగినా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరంగా పలు అంతరాయాలు ఏర్పడతాయని అంటున్నారు. పైగా దీని కారణంగా అమెరికా వృద్ధి తగ్గుతుందని, మిగిలిన దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని అవి హెచ్చరిస్తున్నాయి.

Related Posts
బ్యాంకాక్‌లో జరిగిన ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ క్రౌన్ అందుకున్న రేచల్‌ గుప్తా
rachel gupta

పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల రేచల్ గుప్తా ప్రతిష్ఠాత్మకమైన 'మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024' కిరీటాన్ని గెలుచుకొని భారత్‌కి మరొక గౌరవాన్ని తెచ్చిపెట్టారు. ఈ పోటీలు థాయిలాండ్‌లోని Read more

అందరికి రుణమాఫీ చేసి తీరుతాం – పొంగులేటి
runamafi ponguleti

అర్హులైన రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం గడిచిన పదేళ్లలో రూ.13,500 కోట్లు రెండు విడతలుగా మాఫీ Read more

కనుమ.. ప్రత్యేకతలు ఏంటి..? రథం ముగ్గు.. ఎందుకు ?
kanuma ratham muggu

సంక్రాంతి పండుగలో మూడో రోజు కనుమకు ప్రత్యేక స్థానం ఉంది. కనుమను ప్రధానంగా పశువులకు అంకితం చేస్తారు. రైతుల తోడుగా ఉంటూ ఏడాది పొడవునా శ్రమించే పశువులను Read more

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన సీఎం రేవంత్
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశాలు లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, "ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *