తమిళనాడు లో అజిత్ కుమార్ (వయస్సు సుమారు 28 సంవత్సరాలు) అనే వ్యక్తి తిరుప్పువనం అనే గ్రామంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్నాడు.జూన్ 28, 2025న పోలీసులు అతన్ని పలు అనుమానాల ఆధారంగా అరెస్ట్ చేసి, స్టేషన్కి తీసుకెళ్లారు. రాత్రివేళ అతని ఆరోగ్యం విషమించి, మరుసటి రోజు మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. కానీ, పోస్ట్మార్టం నివేదికలో 44 గాయాలు, అంతర్గత రక్తస్రావం ఉన్నట్లు తేలింది. అధికార డీఎంకే (DMK) బాధ్యతారహిత్యంవల్లే కస్టోడియల్ డెత్స్ జరుగుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండటంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది.

సీబీఐకి అప్పగిస్తే..
అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ను నిరసిస్తూ ఆదివారం టీవీకే పార్టీ భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది. టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay)నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. టీవీకే శ్రేణులు భారీ సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా విజయ్ అధికార డీఎంకే (DMK) పై విమర్శలు గుప్పించారు. అజిత్కుమార్ కుటుంబానికి ముఖ్యమంత్రి స్టాలిన్ సారీ చెప్పడంపై స్పందించారు. సారీ చెబితే సరిపోదని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మీ పాలనలో ఇంకా ఎన్ని దారుణాలు చూడాలని ప్రశ్నించారు. విజయ్ వ్యాఖ్యలపై సోమవారం డీఎంకే (DMK) స్పందించింది. ఆ పార్టీ అధకార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ మాట్లాడుతూ.. కస్టోడియల్ డెత్ కేసును సీబీఐకి అప్పగించామని చెప్పారు. నటుడు విజయ్ ముందుగా బేసిక్ రాజకీయాలు తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. కస్టోడియల్ డెత్లో పోలీసులు నిందితులుగా ఉన్నారని, ఐదుగురు పోలీసులు అరెస్టయ్యారని తెలిపారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తే పోలీసులు వాళ్ల కేసును వాళ్లే దర్యాప్తు చేసుకున్నారని విమర్శిస్తారని, సీబీఐకి అప్పగిస్తే సీబీఐ దర్యాప్తు ఎందుకు అంటారని విమర్శించారు. కాబట్టి ఆయన బేసిక్ పాలిటిక్స్ తెలుసుకోవాలని అన్నారు.
డీఎంకే యజమాని ఎవరు?
ద్రవిడ మున్నేట్ర కజగం భారతదేశంలోని తమిళనాడు మరియు పుదుచ్చేరి రాష్ట్రాలలో ఒక రాష్ట్ర రాజకీయ పార్టీ. ఇది 1949లో సి.ఎన్. అన్నాదురై స్థాపించిన ద్రవిడ పార్టీ. 1969 నుండి, డిఎంకెకు కరుణానిధి నాయకత్వం వహిస్తున్నారు, ఆయన అనేకసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
డీఎంకే కాంగ్రెస్ లేదా బీజేపీతో ఉందా?
బీజేపీ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)తో పొత్తు పెట్టుకోగా, ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) కాంగ్రెస్, పట్టాలి మక్కల్ కట్చి (PMK), మారుమలర్చి ద్రావిడ మున్నేట్ర కజగం (MDMK), CPI, CPM మరియు ఇండియన్ యూనియన్ లీగ్లతో కూడిన కలయికతో జతకట్టింది.
డీఎంకే చరిత్ర ఏమిటి?
DMKని సెప్టెంబర్ 17, 1949న పెరియార్ నేతృత్వంలోని ద్రవిడర్ కజగం నుండి విడిపోయిన వర్గంగా C. N. అన్నాదురై (అన్నా) స్థాపించారు. 1949 నుండి 1969 ఫిబ్రవరి 4న ఆయన మరణించే వరకు అన్నాదురై ప్రధాన కార్యదర్శిగా DMKకి నాయకత్వం వహించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Sneha Debnath:స్నేహా దేబ్నాథ్ మృతి ఘటన – ఢిల్లీ విద్యార్థుల