DMK invited...didn't go: Janasena

Janasena : డీఎంకే ఆహ్వానించింది.. వెళ్లలేదు: జనసేన

Janasena : తమిళనాడు రాజధాని చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై డీఎంకే పార్టీ అధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి పలు పార్టీల నుంచి నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా దక్షిణాదికి చెందిన పలు పార్టీలు హాజరయ్యాయి. అయితే ఈ సమావేశంలో జనసేన పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది. చెన్నైలో డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలంటూ ఆహ్వానం అందిందని, కానీ హాజరుకాలేమంటూ సమాచారం ఇచ్చినట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

 డీఎంకే ఆహ్వానించింది వెళ్లలేదు జనసేన

ఈ అంశంపై మా విధానం మాకు ఉంది

చెన్నైలో డి.ఎం.కె. పార్టీ నియోజకవర్గాల పునర్విజనపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి జనసేన పార్టీకి ఆహ్వానం వచ్చింది. అయితే ఈ సమావేశానికి హాజరు కాలేమని సమాచారం అందించాము. ఈ సమావేశానికి జనసేన హాజరైనట్లు వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే. ఈ సమావేశంలో పాల్గొనాలని డి.ఎం.కె. తరపున ప్రతినిధులు వచ్చి ఆహ్వానం అందించారు. వేర్వేరు కూటములుగా ఉన్నందున ఈ సమావేశంలో పాల్గొనడం లేదని మర్యాదపూర్వకంగా తెలియచేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు సమాచారం ఇచ్చాము. నియోజకవర్గాల పునర్విభజనపై వారి అభిప్రాయాలు వారికి ఉన్నట్లే.. ఈ అంశంపై మా విధానం మాకు ఉంది. ఈ విషయమై మా విధానాన్ని సాధికారికమైన వేదికపై వెల్లడిస్తాం అంటూ జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Related Posts
బిజెపి , బిఆర్ఎస్ పార్టీల పై మంత్రి పొన్నం ఆగ్రహం
ponnam fire

హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్‌లు వేర్వేరు పార్టీలు కాదని, రెండూ ఒకటేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ, బీఆర్ఎస్‌లు చార్జిషీట్‌లు విడుదల Read more

మాటల్లో చెప్పలేని అమానుషం ఇది : ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
Visited the family members of the murdered student YCP MP YS Avinash Reddy

అమరావతి: కడప జిల్లా బద్వేల్‌లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను వైసీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యే Read more

రమేష్ బిధూరిని సస్పెండ్ చేయాలి: సీతక్క డిమాండ్
Ramesh Bidhuri should be suspended.. Seethakka demands

హైదరాబాద్‌: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై దారుణ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బరిలో నిలిచిన రమేష్ బిధూరిపై తెలంగాణ మంత్రి సీతక్క Read more

త్వరలో భారత్‌-చైనా రక్షణ మంత్రుల భేటి..!
Defense Ministers of India and China will meet soon

న్యూఢిల్లీ: త్వరలో భారత్‌-చైనా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, డోంగ్‌ జున్‌ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ మేరకు వారి మధ్య సరిహద్దు, ప్రాంతీయ స్థిరత్వమే అజెండాగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *