వినాయక్ ఆరోగ్యాంగా ఉన్నారు పుకార్లు నమ్మకండి

వినాయక్ ఆరోగ్యాంగా ఉన్నారు పుకార్లు నమ్మకండి

ఈ రోజు ఉదయం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు పుట్టుకొచ్చాయి. ఆయ‌న అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని పలు మాధ్య‌మాల్లో ఈ వార్త‌లు ప్ర‌చారం కావ‌డం గ‌మ‌నార్హం. ఈ వార్తలు వేగంగా వైరల్ కావడంతో, అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

Advertisements

టీమ్ క్లారిటీ

ఈ వార్తలపై వీవీ వినాయక్ టీమ్ అధికారికంగా స్పందించింది. అయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంటూ, కొన్ని మాధ్యమాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.

చట్టపరమైన చర్యలు

వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రామాణిక సమాచారం తెలుసుకొని ప్రచురించాలని టీమ్ విజ్ఞప్తి చేసింది. ఇకపై ఇలాంటి అసత్య ప్రచారాలు కొనసాగితే, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.వీవీ వినాయక్ ఆరోగ్యంపై వచ్చిన నకిలీ వార్తల కారణంగా ఆయన అభిమానులు భయాందోళనకు గురయ్యారు. కానీ, ఆయన ఆరోగ్యంపై క్లారిటీ రావడంతో, ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గత ఏడాది ఆయనకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా జరిగింది.అప్పటి నుంచి ఆయన పూర్తి  విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, తాజాగా ఆయన మరోసారి అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారని, వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు వైద్యం అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.రీసెంట్ గా  వి.వి. వినాయక్ అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలుసుకున్న దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్ రాజు వంటి కొందరు సినిమా సెలబ్రెటీలు ఆయన  ఇంటికి  వెళ్లి ఆయనను పరామర్శించారు.  అయితే అసలు నిజం వేరుగా ఉంది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఆ విషయం చెప్తూ ఆయన టీమ్ ఓ  నోట్ ని  కూడా విడుద‌ల చేసింది. 

Director VV Vinayak Selling His Assets in Vizag 600x450

అందులో ఇలా ఉంది,ప్రముఖ దర్శకులు వి వి వినాయక్ గారు ఆరోగ్యం పై కొన్ని మాధ్యమాలలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా వున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలి అని మనవి.ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకొనబడును. ఎన్టీఆర్ నటించిన ‘ఆది’చిత్రంతో వీవీ వినాయక్ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో టాలీవుడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ఏర్పడింది.ఆ తర్వాత ‘చెన్నకేశవరెడ్డి, దిల్, ఠాగూర్, బన్నీ, అదుర్స్’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. బ్లాక్ బాస్టర్ సినిమాలను అందించిన వీవీ వినాయక్ కూడా స్టార్ స్టేటస్ లోనే కొనసాగుతున్నారు.అయితే, కొన్ని సినిమాలు వరుసగా పరాజయం పాలవ్వడంతో ఆయన సినిమాలకు విరామం ఇచ్చారు.

చివరిగా ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి హిందీ రీమేక్ చేశారు.  ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఆయన హీరోగా అనౌన్స్ చేసిన సీనయ్య సినిమా పట్టాలెక్కుతుందేమో అనుకుంటే అది నిలిచిపోయిందని ప్రకటించారు. ఆ తర్వాత ఆయన ఎలాంటి ప్రాజెక్టును ప్రకటించలేదు.  

Related Posts
బాలయ్య షోలో రామ్ చరణ్ అల్లరి.
బాలయ్య షోలో రామ్ చరణ్ అల్లరి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకు సిద్ధమైంది.ఈ సినిమాకు డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న Read more

రాజమౌళి టార్చర్ భరించలేక..” – శ్రీనివాస్ రావు వీడియో వైరల్
SS రాజమౌళి వివాదం

SS Rajamouli | టాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి (S.S. Rajamouli), ఆయ‌న‌ సతీమణి రమా రాజమౌళి(Rama Rajamouli) వివాదంలో చిక్కుకున్నారు. జ‌క్క‌న్న‌ స్నేహితుడైన యు.శ్రీనివాస్ రావు(U. Read more

మలయాళీ సినిమాలకు తీపిగుర్తుగా 2024.
manjummel boys

మలయాళ సినిమా ఇప్పుడు టాప్ గేర్‌లో ఉంది.గతంలో ఎక్కువగా నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందిన మల్లూవుడ్, ఇప్పుడు పాన్-ఇండియా లెవెల్‌లో సంచలనం సృష్టిస్తోంది.2024 ఏడాది ఈ ఇండస్ట్రీకు Read more

యష్ సినిమాకు లీకుల బెడద..
యష్ సినిమాకు లీకుల బెడద

రాకింగ్ స్టార్ యష్ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించాడు.కేజీఎఫ్ సినిమా ద్వారా ఆయన దేశమంతటా పేరుతెచ్చుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాతో యష్ Read more

×