flight

హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌కు డైరెక్ట్ ఫ్లైట్

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఇక థాయ్‌లాండ్ వెళ్లాలంటే కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాల్సిన పనిలేదు. హైదరాబాద్ నగరం నుంచి నేరుగా థాయ్‌లాండ్ చేరుకోవచ్చు. ఈ మేరకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి థాయ్‌లాండ్‌కు నేరుగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు ప్రారంభించారు. శంషాబాద్ నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నగరానికి తొలి డైరెక్ట్ ఫ్లైట్ శుక్రవారం (జనవరి 31) బయలుదేరింది. ఈ విషయాన్ని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సీఈఓ ప్రదీప్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ కొత్త ఎయిర్ ఇండియా సర్వీసు ద్వారా థాయ్‌లాండ్ లోని ఫుకెట్ – హైదరాబాద్ నగరాల మధ్య ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడుతుందని ప్రదీప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఫ్లైట్ 3.45 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకుంటుందని వెల్లడించారు.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ సర్వీసులు ప్రస్తుతం వారంలో ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో నడుస్తాయని చెప్పారు. ఈనెల 15 నుంచి వారానికి ఆరు విమానాలకు పెంచుతామని ప్రదీప్ తెలిపారు. హైదరాబాద్ – ఫుకెట్ మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించిన మొదటి విమానయాన సంస్థగా నిలవడం సంతోషంగా ఉందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ సింగ్ వెల్లడించారు.
సాధారణ రోజుల్లో విమాన టికెట్‌ రూ.7 వేలు ఉండగా… ప్రస్తుతం రూ.20వేల వరకు ఉంది. ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాకు హైదరాబాద్ నుంచి విమానసర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విమాన సర్వీసుల టికెట్ ధరలను పరిశీలిస్తే.. ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు కనిష్ఠంగా రూ.20,552 నుంచి రూ.33,556 వరకు టికెట్ ధరలు ఉన్నాయి. ఈ ధరలకు అదనంగా ట్యాక్సులు ఉంటాయని తెలిపారు. కొన్ని విమానయాన సంస్థలు ప్రయాణికులకు భోజనం, టిఫిన్ సౌకర్యాలు కూడా అందిస్తున్నాయి.

Related Posts
కేటీఆర్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు
ktr quash petition rejected in supreme court

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం Read more

జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం
lorry cleaner was burnt ali

జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ఇసుక లారీ ని వెనుక నుంచి వ్యాన్ ఢీకొట్టిన సంఘటనలు మంటలు చెలరేగాయి. వ్యాను ముందు భాగంలో చిక్కుకున్న వ్యాన్ క్లీనర్ Read more

జగన్ పై పురందేశ్వరి ఘాటు వ్యాఖ్యాలు
జగన్ పై పురందేశ్వరి ఫైర్ ఘాటు వ్యాఖ్యాలు

వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీకి వచ్చి వెంటనే వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి స్పందిస్తూ Read more

ఈ నెల 17న మంగళగిరి ఎయిమ్స్ కు రాష్ట్రపతి
President to Mangalagiri AI

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్‌ ప్రథమ స్నాతకోత్సవానికి హాజరవుతున్నారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *