Dilsukhnagar bomb blast case.. Accused sentenced to death

Dilsukhnagar blasts case : దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు ఉరిశిక్ష

Dilsukhnagarblasts case : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్ సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు సమర్థించింది. ఉరిశిక్షను రద్దు చేయాలంటూ ఐదుగురు దోషులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. 2013 ఫిబ్రవరి 21 న జరిగిన దిల్ సుఖ్ నగర్ జంట బాంబ్ పేలుళ్లు జరిగాయి. ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ చర్యగా గుర్తించింది NIA కోర్టు. ఈ జంట పేలుళ్లో లో 17 మంది మృతి చెందగా, 150 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో యాసినన్ బత్కల్ కిలక సూత్రధారిగా గుర్తించారు. ఇప్పటికే ఐదుగురు నిందితులకు NIA స్పెషల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఏ-1 గా అసదుల్లాహ అక్తర్, ఏ-2 యాసిన్ భక్తల్, ఏ-3 తహసిన్ అక్తర్, ఏ-4 గా జియావుర్ రెహ్మాన్,ఏ5 గా ఎజాక్ షాయిక్ లను దోషులుగా తేల్చింది.

Advertisements
దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల

ఉరిశిక్ష సరైనదేనంటూ తీర్పు

కాగా, జంట పేలుళ్ల కేసులో అయిదుగురు నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు మహమ్మద్‌‌ రియాజ్‌‌ అలియాస్‌‌ రియాజ్‌‌ భత్కల్‌‌ పరారీలో ఉండగా, మిగిలిన అసదుల్లా అక్తర్‌‌ అలియాస్‌‌ హద్ది, జియా ఉర్‌‌ రహమాన్‌‌ అలియాస్‌‌ వఘాస్‌‌, మహమ్మద్ తహసీన్‌‌ అక్తర్‌‌ అలియాస్‌‌ హసన్, మహమ్మద్‌‌ అహ్మద్‌‌ సిద్ధిబప అలియాస్‌‌ యాసిన్‌‌ భత్కల్‌‌, అజాజ్‌‌ షేక్‌‌ అలియాస్‌‌ సమర్‌‌ ఆర్మాన్‌‌ తుండె అయిదుగురికి ఎన్‌‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే NIA కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. వాదనల అనంతరం ఏప్రిల్ 8న నిందితుల పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు.. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్ష సరైనదేనంటూ తీర్పునిచ్చింది.

టిఫిన్ బాక్సులో బాంబు పెట్టిన టెర్రరిస్టులు

2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ బస్టాండ్ సమీపంలో కొద్ది నిమిషాల గ్యాప్లోనే రెండు పేలుళ్లు జరిగాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబ్ పేలిన కొద్దిసేపటికే.. 150 మీటర్ల దూరంలోనే మరో బ్లాస్ట్ సంభవించింది. టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి.. టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. పేలుళ్ల ధాటికి 17 మంది మరణించగా, దాదాపు 130 మందికిపైగా గాయపడ్డారు.బ్లాస్ట్ కేసును NIA దర్యాప్తు చేసింది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌, అసదుల్లా అక్తర్‌ (యూపీ), జియా-ఉర్‌-రెహమాన్‌ (పాకిస్థాన్‌), తెహసీన్‌ అక్తర్‌ (బీహార్‌), అజాజ్‌ షేక్‌ (మహారాష్ట్ర) కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.

Read Also : మెట్రో స్టేషన్‌ వద్ద లారీ బీభత్సం..కానిస్టేబుల్‌ మృతి

Related Posts
భోగీలో లభ్యమైన రెండు బ్యాగులు షాక్ అయినా పోలీసులు
భోగీలో లభ్యమైన రెండు బ్యాగులు షాక్ అయినా పోలీసులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గంజాయి స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, క్రమశిక్షణా బద్ధంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా కొనసాగుతోంది. నిషేధిత పదార్థాలను తరలించేందుకు స్మగ్లర్లు కొత్త మార్గాలు Read more

శాస్త్రీయ ఉత్సుకతను పెంపొందిస్తోన్న వెల్‌స్పన్ ఫౌండేషన్
Welspun Foundation for Health & Knowledge, fostering leadership and scientific curiosity in Telangana

హైదరాబాద్ : వెల్‌స్పన్ ఫౌండేషన్ ఫర్ హెల్త్ & నాలెడ్జ్, ఇటీవల తెలంగాణలో నాయకత్వ నైపుణ్యాలను బలోపేతం చేయడంతో పాటుగా శాస్త్రీయ ఉత్సుకతను ప్రోత్సహించడానికి రెండు ప్రభావవంతమైన Read more

మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ ప్రారంభం
Swachh Andhra Swachh Diva

కడప జిల్లా మైదుకూరులో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. Read more

వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు
Another case registered against Vallabhaneni Vamsi

పలు స్టేషన్లలో మూడు కేసులు నమోదు అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకాలు, దందాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు భయపడి గత Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×