Diamond merchant Mehul Choksi arrested!

Mehul Choksi : వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అరెస్టు !

Mehul Choksi : ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు ఒక నివేదికలో వెల్లడించారు. భారత సీబీఐ అధికారులు కోరిక మేరకు మెహుల్‌ ఛోక్సీ బెల్జియం పోలీసులు శనివారం అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో అతడిని అప్పగించాలని భారత్‌ కోరింది. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్‌ చేసినట్టు తెలిసింది. దీంతో, ఛోక్సీని తర్వలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది.

Advertisements
వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ

విదేశాలకు పారిపోయిన మెహుల్‌ ఛోక్సీ

ఇక, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో, అతడిని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, అతడు బెల్జియంలో ఉన్నట్లు ఇటీవల అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో సీబీఐ అభ్యర్థన మేరకు అతడిని బెల్జియం అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇక, ఛోక్సీని అరెస్టు చేస్తున్నప్పుడు ముంబై కోర్టు జారీ చేసిన రెండు ఓపెన్-ఎండ్ అరెస్ట్ వారెంట్లను పోలీసులు ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

చోక్సీకి ఆ దేశ పౌరసత్వం

అంతకుముందు.. పీఎన్‌బీ కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన చోక్సీ.. బెల్జియం పౌరురాలైన తన భార్య ప్రీతీతో కలిసి ఆంట్వెర్ఫ్‌లో ఉంటున్నాడని, అక్కడ ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందాడని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. వైద్య చికిత్స కోసం ఆంటిగ్వా అండ్ బార్బుడా నుంచి బెల్జియానికి మకాం మార్చిన చోక్సీకి ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది.

దేశం దాటిపోయిన మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు

కాగా, 2018 జనవరిలో దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటపడటానికి కొద్ది వారాల ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీలు దేశం దాటిపోయారు. కుంభకోణం బయటపడటానికి రెండు నెలల ముందే అతడు అంటిగ్వా పౌరసత్వం పొందినట్టు తెలిసింది. ఈ కేసులో మరో నిందితుడు, చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీని లండన్ నుంచి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.

Read Also: రాత్రివేళ మెరిసిపోతూ కనిపించిన భారత్… ఫొటోలు విడుదల

Related Posts
రాజ్యసభకు కుటమి అభ్యర్దుల నామినేషన్
rajyasabha

రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేస్తున్న టీడీపీ అభ్యర్థులు సానా సతీష్, బీదా మస్తాన్రావు, బిజెపి అభ్యర్థి ఆర్. కృష్ణయ్య మూడు రాజ్యసభ ఎంపి సీట్లకు ముగ్గురు అభ్యర్థులు Read more

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన
ponguleti indiramma

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన లబ్ధిదారులకు ఇది అందించాలనే ప్రభుత్వ విధానమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ Read more

నిజమైన ‘భారతరత్న’ మన్మోహనుడే!
manmohan singh bharatartna

భారత ఆర్థిక వ్యవస్థకు ఆధునిక రూపం ఇచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన మృతితో దేశవ్యాప్తంగా ప్రజలు, నెటిజన్లు తీవ్ర దిగ్బ్రాంతి Read more

RBI: లక్ష నుండి 2 లక్షల వరకు ఆర్బీఐ అనుమతి
లక్ష నుండి 2 లక్షల వరకు ఆర్బీఐ అనుమతి

మీరు యుపిఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా అయితే ఈ వార్త మీ కోసమే. డిజిటల్ పేమెంట్స్ మరింత సులభం ఇంకా ఉపయోగకరంగా మార్చేందుకు యుపిఐ ట్రాన్సక్షన్స్ సంబంధించి Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×